Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkata Reddy : ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీరు అందిస్తాం

–రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన , తిప్పర్తి : ఏ ఎం ఆర్ పి ద్వారా తిప్పర్తి మండలం లో ని ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీటిని అందిస్తామని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందువలన ఆయకట్టు చివరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆదివారం అయన నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాల పెద్ద చెరువును తనిఖీ చేశారు.

అంతేగాక తిప్పర్తి మండలం మామిడాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎంఆర్పి ద్వారా అందిస్తున్న సాగునీటి సరఫరాను తనిఖీ చేశారు. కాగా డి.40 ప్రధాన కాలువ కింది 11.ఎల్ మైనర్ కాలువ ద్వారా మామిడాల పెద్ద చెరువు నింపే క్రమంలో
కాలువ తవ్వకానికి రైతు పురుషోత్తమ రావు అభ్యంతరం తెలుపగా, ఈ విషయమై మంత్రి అధికారులతో నష్టపరిహారం వివరాలన్నింటినీ తెలుసుకున్న అనంతరం మామిడాల పెద్ద చెరువు నుండే నేరుగా పురుషోత్తమ రావు తో మాట్లాడి కెనాల్ తవ్వెందుకు సహకరించాలని, దానివల్ల చెరువు కింద ఉన్న సుమారు 160 నుండి 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని కోరగా, అందుకు పురుషోత్తం రావు అంగీకారం తెలిపారు.

 

 

రైతు అంగీకారం అనంతరం మంత్రి తక్షణమే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వెంటనే కాలువ తవ్వకం పూర్తిచేసి మామిడాల పెద్ద చెరువును నీటితో నింపాలని, తద్వారా చెరువుకింది ఆయకట్టు భూములన్నింటికీ సాగునీరు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితులలో రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో కాలువ తవ్వే వరకు తాత్కాలికంగా తవ్వకం ఏర్పాటు చేసుకొని చెరువుకు నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆర్డీవోను, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మామిడాల తో పాటు ,మండలంలోని ఇతర గ్రామాలలో ఆయకట్టు చివరి భూములకు సాగునీరు వస్తుందని అందువలన రైతులేవరు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.

చివరి వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కాగా మామిడాల పెద్ద చెరువు సమీపంలోనే వడ్డెర కులా నికి చెందిన ముత్తం రాజేశ్వరి ఇల్లు లేక గుడిసెలో నివసిస్తుండ డాన్ని చూసిన మంత్రి తక్షణమే వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయా లనిఎం పి డి ఓ ను ఆదేశించారు. అంతేకాక అప్పటివరకు తాత్కాలి కంగా నివసించేందుకు 50 వేల రూపాయలు తో ఉండేందుకు షెడ్ లాంటిది ఏర్పాటు చేయాలని ఆదే శాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ,నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఆర్ అండ్ డిప్యూటీ ఇంజనీర్ గణేష్,జిల్లా స్థాయి అధికారులు, మండల ఆధికారులు, ఉన్నారు