Minister Lokesh: ప్రజా దీవెన, అమరావతి: ‘‘జగన్ …నువ్వు ఎవరితోనైనా పెట్టుకో…తిరుమల శ్రీవారితో పెట్టుకోకు..నీకే మంచిది కాదు’’ అంటూ మంత్రి లోకేష్ (Minister Lokesh) మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని (Jagan Mohan Reddy) ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియతో మాట్లాడుతూ ఉన్నవి లేనట్లు..లేనివి ఉన్నట్టు క్రియేట్ చేసి తన మీద లేనిపోని ఆరోప ణలు చేస్తుండటం పట్ల లోకేష్ మండిపడ్డారు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలు తిరు మలలో జరిగినట్లు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తుండటం పట్ల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh))ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పి దాన్ని నిజం చేయాలనే భ్రమతో జగన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెక్స్ లో పోస్ట్ చేశారు.
ఫేక్ జగన్ నువ్వు మారవు, నీ ఫేక్ మూకలు కూడా మారరు ఫేక్ చేసి చేసి 151 సీట్లు ఇప్పుడు 11 సీట్లకు వచ్చాయని, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఒక్క సీటు కూడా రాదని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఎక్స్ లో వ్యంగ్యంగా పోస్టు చేశారు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలను తిరుమలలో పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.
తిరుమల ఏడుకొండలపై (Tirumala Edukondala)నీ విష రాజకీయాలు మానుకోవాలని మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు హితువు పలికారు. రెండు రోజుల క్రితమే మంత్రి నారా లోకేష్ పై మాజీ సీఎం జగన్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కలిసి బ్రష్టుపట్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ (jagan)ఆరోపించారు. జగన్ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ కూడా ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. విజయవాడ వరదల విషయంలో కూడా జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల విషయంలో మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ మరోసారి విరుచుకుపడ్డారు.