Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Nara Lokesh: కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి లోకే ష్ వరుస భేటీలు

Minister Nara Lokesh: ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం మధ్యా హ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మంత్రి సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో లోకేష్ చర్చించారు. ఇం దులో భాగంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజ యాలు, కేంద్ర సహకారంతో అమ లు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరి స్థితులను కేంద్రమంత్రికి లోకేష్ వివ రించారు. ఈనెల 21న విశాఖలో ప్ర ధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పా ట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం లో అమలవుతున్న ప్రాజెక్టుల పురో గతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు.

సుదీర్ఘ పాద యాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నిం పిన లోకేష్‌ను అమిత్ షా ప్రత్యే కంగా అభినందించారు. చంద్రబా బు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్‌కు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. అనం తరం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో మంత్రి సమావేశమయ్యారు. రా ష్ట్రానికి సంబంధించిన పలు అం శాలపై చర్చించారు. కాగా ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌‌‌‌ను మర్యాదపూర్వంగా క లిశారు మంత్రి లోకేష్. సుమారు గంటపాటు వీరి సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఏడాది పాలన లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉప రాష్ట్రపతికి వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని ఉప రాష్ట్రపతిని మంత్రి లోకేష్ కోరారు. మంత్రితో పాటు ఉపరాష్ట్రపతిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయు డు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరా యలు, సానా సతీష్, బైరెడ్డి శబరి కలిశారు.

ఢిల్లీ పర్యటలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను మంత్రి లోకేష్ కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో భేటీ అయిన మంత్రి.. ఈరోజు సాయంత్రం సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అవుతారు. అలాగే సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మే ఘవాల్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేం ద్రమంత్రులతో మంత్రి లోకేష్ చర్చిం చనున్నారు.