Minister Pongileti Srinivas Reddy : ప్రజా దీవెన మణుగూరు: తెలం గా ణ రాష్ట్రంలో ఈ నెల 14న శిల్పా రామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన భూభారతి కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయనున్నామని రెవి న్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీని వాస్ రెడ్డి ప్రకటించారు. ధరణి పేరు తో గత ప్రభుత్వం ఒక కోటి 57 లక్ష ల ఎకరాలను విదేశీ సంస్థలకు తా కట్టు పెట్టిందని దుయ్యబట్టారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బ లోపేతం చేసేందుకు కొత్తగా తీసు కువచ్చిన భూ భారతి చట్టాన్ని ప్ర జలకు అంకితం చేసే కార్యక్రమం ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతు ల మీదుగా జరగనుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రోజు మ ణుగూరులోని పినపాక శాసనస భ్యులు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభు త్వంలో ఏదైతే ఒక మైలురాయిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకు న్న భూములను భద్రత కల్పించే ఒ క అద్భుతమైన భూభారతి చట్టం 2025 ని అన్ని జిల్లా కలెక్టర్లు రెవె న్యూ ఇన్స్పెక్టర్లను ఈ సభకి ఆహ్వా నించి, రాష్ట్రంలోనీ మారుమూల ప్రాంతంలో ఉండే భూములను ఆసాములకు ద్వారా మనస్ఫూర్తి గా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తున్నా మని ఆయన అన్నారు.
ప్రభుత్వంపై ఎంతమంది, ఎన్ని శక్తులు, కుట్రలు కుతంత్రాలు పన్ని న ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయ లేరని ఆయన తెలిపారు. గత ప్ర భుత్వం ధరణి ప్రవేశ పెట్టీ ఒక కోటి 57 లక్షల ఎకరాలను విదేశీ సంస్థల కు తాకట్టు పెట్టిందని విమర్శించా రు. ధరణి మూడేళ్ల పాటు అమల్లో ఉన్న రూల్స్ ను రూపొందించలే దని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భూభారతి చట్టానికి చట్టం రూపొం దించిన అనతి కాలంలోనే రూల్స్ ను రూపొందించమని తెలిపారు. దీని ద్వారా చిన్న సమస్య కూడా క్షణాల్లో ప్రకారం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబా ద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్,పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.