Indiramma Housing Scheme : మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్య, వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇంది రమ్మ ఇండ్లు
Indiramma Housing Scheme :ప్రజా దీవెన, నకిరేకల్:రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదవారికి కట్టిం చి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి అన్నారు. గురువారం అ యన నల్గొండ జిల్లా నకిరేకల్ మం డల కేంద్రంలో ఎంపీడీవో కార్యాల య ఆవరణంలో నిర్మించిన నమూ నా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిం చారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ పేదవాడు బలోపేతం అయ్యేం దుకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఇల్లు లేని, కనీసం గోడ కూడా కట్టుకోలేని వారికి మొ దటి విడతలో ఇండ్లను కేటాయి స్తున్నామని చెప్పారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో విడతల వారీగా అర్హులైన పేదవారందరికీ ఇండ్లు ఇస్తామని, మొదటి విడ తలో ప్రతి నియోజకవర్గానికి 35 00 చొప్పున ఇండ్లు ఇవ్వడం జరి గిందని ,ఇంకా 3 విడతలుగా ఇండ్ల ను ఇవ్వడం జరుగుతుందని వెల్ల డించారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదవా రందరికీ 20 లక్షల ఇండ్లను 5 లక్ష ల రూపాయల వ్యయంతో కట్టించి ఇస్తామన్నారు.భూ సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసు కువచ్చిన భూ భారతి చట్టం దేశాని కే రోల్ మోడల్ కానుందని అన్నా రు. జూన్ 2 నుండి ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసిల్దా ర్ స్థాయి అధికారులు వచ్చి న్యా యమైన భూ సమస్యలను పరిష్క రించనున్నారని తెలిపారు. భూ బారతిలో పెండింగ్లో ఉన్న తొమ్మి ది లక్షల ఇరవై ఆరువేల సాదా బైన మాల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ శాశ్వతంగా పరిష్కారమయ్యేలా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి హక్కులు కల్పించనున్నామన్నారు.
భూ భారతి చట్టాన్ని దేశంలోని ఇ తర రాష్ట్రాలు ఆదర్శంగా తీసు కు నే విధంగా తీర్చిదిద్దామని, ధరణి కేవలం కొద్ది మందికి మాత్రమే ఉప యోగపడిందని, భూ భారతిలో స మస్యలన్నిటిని పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. భూ భారతిలో నకిరేకల్ మండలాన్ని పైలెట్ మండలం గా తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం పేదవాడి కోరికలన్ని తుంగలో తొక్కి వారి స్వార్థం కోసం తాపత్రయపడడం తప్ప ఎలాంటి ఉపయోగపడే పని చేయలేదని, 4 5 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని,తాము అధి కారంలోకి వచ్చాక 650 కోట్లు ఖ ర్చు చేసి తాత్కాలికంగా తాగునీటి ఏర్పాట్లు చేసి తాగు నీటిని అంది స్తున్నామన్నారు. లక్ష పదివేల కో ట్లు ఖర్చు చేసి కాలేశ్వరం నిర్మిస్తే కూలిపోయిందని అన్నారు. గడ చిన 15 నెలల్లో తెలంగాణ రాష్ట్రం లో వైద్యంపై 11800 కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం సంవత్స రానికి 5650 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు.
విద్యలో భాగంగా హాస్టల్స్, పాఠశా లలు కట్టించడమే కాకుండా, 58 నియోజకవర్గాలలో 11600 కోట్ల తో ప్రతి నియోజకవర్గానికి 200 కో ట్ల రూపాయలతో ఒక్కొక్కటి ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ల ను కట్టిస్తున్నామన్నారు. పేద వి ద్యార్థులను దృష్టిలో ఉంచుకుని 8 0% డైట్ చార్జిలను పెంచామని, 20 0% కాష్మోటిక్ చార్జీలు పెంచామ న్నారు. 200 యూనిట్ల వరకు ఉ చిత విద్యుత్తు, 500 రూపాయల కు ఎల్ పీజీ కనెక్షన్, రాజీవ్ ఆరో గ్య శ్రీ కింద పరిమితిని పదిక్షలకు పెంచడం,మహిళలకు ఉచిత బ స్సు, ఒక్కొక్కరికి ఆరు కేజీలు చొ ప్పున సన్న బియ్యం వంటి పథ కాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన నకిరేకల్ శాసనసభ్యుల కోరిక మేరకు నకిరే కల్ మండలానికి నూతన తహసి ల్దార్ కార్యాలయ భవనాన్ని మం జూరు చేశారు. అదేవిధంగా మండ లంలో పెండింగ్లో ఉన్న భూ సమ స్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టిం దని, అందులో ఒకటి భూ భారతి, మరొకటి ఇందిరమ్మ ఇండ్లు అని, ప్రతి నియోజకవర్గానికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టించి ఇ వ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధం గా నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల కు ఇస్తున్నారన్నారు. అట్లడుగున ఉన్న పేదవారికి ఇల్లు ఇవ్వాలని, అప్పుడే సమాజంలో మార్పు వ స్తుందన్నారు. రెండవ విడత మొ దటి విడత రానివారందరికీ ఇండ్లు వస్తాయని, ప్రభుత్వ పథకాలను స ద్వినియోగం చేసుకోవాలని ఆయ న కోరారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ ఇందిరమ్మ ఇండ్లను పార దర్శకంగా కేటాయిస్తున్నామని, ప్ర తి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఏ ర్పాటు చేసి రెండు వందల ఇండ్లకు ఒక గెజిటెడ్ అధికారిని ఏర్పాటు చేసి సర్వే నిర్వహించిన తర్వాత జాబితా రూపొందించామని, ఆ జా బితాను ఇన్చార్జి మినిస్టర్ ఆమో దంతో లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పారు. ఇద్దరమ్మ ఇండ్లు అత్యం త పేదవాడికి ఇవ్వడం జరుగుతుం దని, నల్గొండ జిల్లాలో 167 మంది కి లక్ష రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలలో మొదటి విడత నిధులు జమ అయ్యాయని, రెండ వ విడతన పిల్లర్ల వరకు వచ్చిన వారికి 2 లక్షల రూపాయలు వేయ డం జరుగుతుందని, ఇందిరమ్మ బి ల్లుల చెల్లింపుల విషయంలో ఎవ రు అపోహ పడవద్దు అని, ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని తెలిపా రు. నకిరేకల్ నియోజకవర్గంలో చా లామంది గ్రామకంఠంలో ఇండ్లు ని ర్మించుకొని ఏండ్ల తరబడి నివాసం ఉంటున్నామని దరఖాస్తులు వస్తు న్నాయని,వారి సమస్య పరిష్కా రానికి ఆ విధంగా వారు వాంగ్మూ లం ఇస్తే న్యాయమైన వారికి అను మతి ఇస్తామని, అలాగే యల్ వన్, ఎల్ టు లో పేర్లు రాలేదని సందేహా లు ఉన్నాయని, వాటన్నింటిని తీ రుస్తామని తెలిపారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ ని యోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా కేటాయించాలని, తహ సిల్దార్ కార్యాలయం నూతన భవ నాన్ని మంజూరు చేయాలని, గతం లో ఎస్ఎల్ బిసీ కోసం తీసుకోన్న భూముల సమస్యను పరిష్కరిం చాలని, అలాగే ఇనుపాముల గ్రా మంలో ఒకే వ్యక్తిపై 50 నుండి 100 ఎకరాలు లెక్కించడం జరిగిందని, దానిని సరిచేయాలని కోరారు .
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లా డుతూ పేదలు ఇండ్లు లేక జాగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇం డ్లు ఇవ్వాలని ,పేదలకే సంక్షేమ ప థకాలు ఇవ్వాలని కోరారు.
మరో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మా ట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలో 20 సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగిందని ,సీలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి బలహీన వ ర్గాలకు మేలు చేసిందని అన్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బ త్తుల లక్ష్మారెడ్డి, మాజీ బీసీ కా ర్పొ రేషన్ చైర్మన్ శంబయ్య మాట్లాడా రు.
డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్ అమిత్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కు మార్, ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉ న్నారు.