–ముగిసిన మూడు విడతల రెవె న్యూ సదస్సులు
–మూడు విడతల్లో 10వేల రెవె న్యూ సదస్సులు, 8.58లక్షల దర ఖాస్తులు స్వీకరణ
–దశాబ్దకాలం భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్ద ప్రక్షాళన చేపట్టాం
–రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమా చార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Minister Ponguleti Srinivasa Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో దశాబ్దకాలం పాటు బిఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్ధను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచా ర పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి తెలంగా ణ ప్రజానీకం ఎదుర్కొన్న భూ సమ స్యలకు శాశ్వత పరిష్కారం చూపా లన్న ఆశయంతో తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అ మలు చేస్తున్నామని రెవెన్యూ వ్య వస్దలో భూ భారతికి ముందు భూ భారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపధ్యంలో మంత్రి శనివారం అధి కారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూఆనాటి ప్రభుత్వం ఎంతో గొప్ప గా 2020లో తీసుకువచ్చిన ఆ ర్వోఆర్ చట్టాన్ని తిరగరాసి పారద ర్శక పాలనకు పెద్దపీట వేస్తూ రైతు లు కష్టాలు తీర్చడమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చా మన్నారు.
పదేళ్లలో రైతులు పడ్డ కష్టాలు బా ధలు వారు ఏవిధమైన సమస్యల ను ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇటీ వల నిర్వహించిన రెవెన్యూ సద స్సులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమ న్నారు. మూడు దశల్లో దాదాపు 10లక్షలకు పైగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చా యన్నారు.
ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చ ట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా ఆవిష్క రించుకోవడం జరిగిందని ఆరోజు నుంచే రెవెన్యూ వ్యవస్దలో నూతన శకం ప్రారంభమైందన్నారు. ఈ చ ట్టాన్ని దశల వారీగా అమలులోకి తీసుకురావడం జరిగిందని మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు 4మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12వేల ద రఖాస్తులు , తర్వాత రెండవ దశలో మే 5వ తేదీ నుంచి 28 మండలా ల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు రాగా సాదా బైనామాల అంశం మినహా సుమా రు 60 శాతంపైగా సమస్యలకు ప రిష్కారం చూపడం జరిగిందన్నారు.
ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని ఈ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని మొత్తంగా మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ స దస్సులు నిర్వహించామని, ఇందు లో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చా యని వివరించారు.
అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67వే లు, భద్రాద్రి కొత్తగూడెం 61వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48వేలు, నల్గొండ 42 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపా రు.
రెవెన్యూ సదస్సులకు ముందురోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితం గా దరఖాస్తులను ఇవ్వడం జరిగిం దని ఎమ్మార్వో ఆధ్వర్యంలో ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులే ప్ర జల వద్దకు వచ్చి ఎలాంటి రుసు ము లేకుండా దరఖాస్తులను స్వీక రించారని తెలిపారు. స్వీకరించిన వాటికి రశీదులను అందజేయడం జరిగిందన్నారు. వచ్చిన దరఖాస్తు ల్లో ఇప్పటివరకు 3.27 లక్షల దర ఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, మిగిలిన వా టిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచిం చారు.