Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sitakka: సదరం సర్టిఫికెట్ల జారీలో గత సర్కారు నిర్లక్ష్యం

— డాక్టర్ల వర్క్ షాప్ లో మంత్రి సీతక్క

Minister Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో సదరం సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, అందుకే అర్హులు చాలామంది నష్ట పోయారని మంత్రి సీతక్క ఆరోపిం చారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంగళవారం సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్ల కు వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమా ని కి ముఖ్య అతిథిగా సీతక్క హాజరై డాక్టర్లకు కిట్లు అందజేశారు.

అనంతరం మాట్లా డుతూ గత అ నుభవాల దృష్టిలో దివ్యాంగుల్లో వై కల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి వర్క్ పన్ను నిర్వహిస్తున్నామన్నారు. రా ష్ట్రవ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో సద రం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవై కల్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఇందుకు ఒ క్కో ఆస్పత్రికి రూ.10 లక్షల చొ ప్పున మొత్తం రూ. 3.8 కోట్లను రిలీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.

సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ప్ర భుత్వం దివ్యాంగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అందుకే డాక్టర్లు మానవతను జోడించి వైకల్య పరీ క్షలు నిర్వహించాలని సూచించా రు. దివ్యాంగులకు ఆత్మగౌరవం దక్కాలంటే డాక్టర్లు పక్కాగా పరీ క్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. ఈ పవిత్ర యజ్ఞం లో దివ్యాంగులందరికీ అండగా ని లవాలని పిలుపునిచ్చారు.