–తెలంగాణ అన్ స్టాపబుల్ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్
–రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రండి
-‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
Minister Sridhar Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఇతర రాష్ట్రాలకు సంక్షేమం, అభి వృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తు న్న తెలంగాణతో కలిసి పని చేసేం దుకు ముందుకు రావాలని పలు దే శాల ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు కోరారు. శుక్రవారం బంజారా హిల్స్ తాజ్ డెక్కన్ హోటల్ లో ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేష న్(ఐబీసీ)’ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ – 20 25’ను లాంఛనంగా ప్రారంభించి ప్ర సంగించారు.
మొదట్లో చాలా మంది తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్నారు. కానీ ఆనతి కాలంలోనే తెలంగాణ అన్ స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర జీడీపీ ₹16.12 లక్షల కోట్లకు చేరింది. 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు (9.9%)ను దాటేసింది. తలసరి ఆదాయం ₹3.79 లక్షలు. ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడు లను సేకరించగలిగామన్నారు. గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్ లో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులను సాధించా మని తెలిపారు.
2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని, రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం కాగా దేశంలో ఇది 55 శాతంగా ఉందని ఇవి అంకెలు కా దు తెలంగాణ పురోగతికి నిదర్శ నాలని ఈ సందర్భంగా మంత్రి వివ రించారు. ప్రతి భాగస్వామ్యం ఒక లావాదేవీ కాదు అది ఒక మార్పు అని , అందుకే అంతర్జాతీయ భాగ స్వామ్యాలతో తెలంగాణ పురోగతి ని మరో అడుగు ముందుకు తీసుకె ళ్లాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పె ట్టుకుందని, ఆగ్రో ఇన్నోవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, డిజి టల్ ఫార్మింగ్, ఫ్యూచర్ – రెడీ ఎ డ్యుకేషన్, సస్టైనబుల్ మాను ఫ్యా క్చరింగ్, క్లీన్ ఎనర్జీ తదితర అంశా ల్లో ప్రపంచ దేశాలతో పని చేసేందు కు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పా రు.
‘మిగిలిన రాష్ట్రాలు ట్రెండ్ను అను సరిస్తే తెలంగాణ దాన్ని సృష్టిస్తుం దని, అందుకే కేవలం ఇక్కడ పెట్టు బడులు పెట్టేందుకు మాత్రమే రా వొద్దని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వా మ్యమయ్యేందుకు కలిసి రండని పిలుపునిచ్చారు. ‘బ్రెజిల్, జర్మనీ, రష్యా, కామెరూన్, మాల్టా, యూకే, బల్గరేయా, బెల్జియం, యూఏఈ, దుబాయి తదితర 25 దేశాల ప్రతి నిధులు ఒకే వేదిక పైకి రావడం శు భపరిణామమని వ్యాఖ్యానించా రు.
ఇది ఒక సదస్సుగా మిగిలిపోకుం డా వివిధ దేశాల మధ్య సంస్కృతి, వ్యూహాలు, టెక్నాలజీ బదలాయిం పునకు వారధిగా నిలవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నామని , తె లంగాణలో పరిశ్రమల ఏర్పాటు కు న్న అనుకూలతలు, ప్రభుత్వం కల్పి స్తున్న ప్రోత్సహాకాలను మీ దేశంలో ని పారిశ్రామికవేత్తలకు వివరించం డని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించండని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిప్లోమేటిక్ రిలేష న్స్(ఐవోడీఆర్) మాల్టా గవర్నర్ లిల్లో మర్రా, కార్యదర్శి మార్సెల్లో పట్టి, బెల్జియం ఎంపీ ఇవాన్ పెట్రో వ్, జర్మనీ డిప్లోమాట్ డానియల్ జెర్బిన్, అర్జెంటీనా ఎంపీ క్లాడియో సింగోలనీ, ఐబీసీ ఛైర్మన్ సాల్మన్ గట్టు, డైరెక్టర్ గ్లోరియా సుహాసిని తదితరులు పాల్గొన్నారు.