Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister sridar babu: చూస్తేకదా కనిపించేది..!

–కళ్ళున్న కాబోధిలా నటిoచేవారికి
ఏమి కనబడుతుంది
–రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందో, పెరిగిందో అప్పుడు తెలుస్తుంది
–మీరు దుష్ప్రచారం చేసినా గ ణాంకాలు అబద్ధం చెప్పవుగా
–నిర్మాణ రంగ అభివృద్ధికి మా ప్ర భుత్వం కట్టుబడి ఉంది
–టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

Minister sridar babu : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపా రం తగ్గిందంటూ కొందరూ కావాలనే పనిగట్టుకొని మా ప్రభుత్వంపై దు ష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారు ఒక్కసారి కళ్లు తెరిచి వాస్త వాలు తెలుసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. శనివారం హై టెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో “టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో 20 25″ను ఆయన లాంఛనంగా ప్రారం భించారు.

“2024- 25 ఆర్థిక సంవ త్సరంలో రియల్ ఎస్టేట్ & ప్రొఫెషనల్ సర్వీ సెస్ రంగంలో 15.4 శా తం వృద్ధి రేటు నమోదయ్యింది. నిర్మాణ రం గం 11.97 శాతం వృద్ధి చెందింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం రూ.80వేల కోట్లు సమకూర్చింది. తెలంగాణ సర్వీసెస్ ఎకాన మీలో ఈ రంగం వాటా 24.9 శాతం, ప్రస్తు తం రెరా దగ్గర 9744 రి యల్ ఎస్టే ట్ ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇ వి గణాంకాలు కాదు మా హయాం లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మ దించిందటూ తప్పుడు ప్రచారం చే స్తున్న వారికి చెంప దెబ్బ అని వివ రించారు.

“ఈ ఏ డాది ఫిబ్రవరిలో ఒక్క హైద రాబాద్ లోనే 5900 ఇళ్ల రిజిస్ట్రేష న్ జరిగింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.కోటి, అంత కంటే ఎక్కువ ధర గల ఇళ్ల వాటా 18 శాతంగా ఉంది. ఈ తర హా ఇళ్ల కొనుగోలులో వార్షిక వృద్ధి రే టు 58 శాతంగా నమోదు అయ్యిం దని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించిందని గుర్తు చేశారు. రా ష్ట్రంలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయి స్తాం, తొలి దశలో 4.16 లక్షలు ఇ చ్చాం. ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గౌ రవప్రదంగా జీవించాలనే సంకల్పం తోనే ఈ పథకానికి శ్రీకారం చు ట్టామని చెప్పారు.

“రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెము కగా నిలుస్తున్న నిర్మాణ రంగం అభి వృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు స మస్యలను పరిష్కరిస్తున్నాం. యం గ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వన రులను తయారు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వేదిక ద్వారా బిల్డర్లు, కొనుగోలు దారులకు ఒక్కటి స్పష్టంగా చెప్పా లనుకుంటున్నాను. ప్రభుత్వం మీ వెంట ఉంది. నిర్మాణ రంగ అభివృ ద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడా నికైనా సిద్ధంగా ఉంది. ఎలాంటి అ పోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా అ డుగు ముందుకు వేయండని కోరా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరి కపూడి గాంధీ, గండ్ర సత్యనారా యణ రావు, క్రెడాయ్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.