Minister Sridhar Babu : ప్రజా దీవెన, మెల్ బోర్న్: దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రా ష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తు న్న తెలంగాణలో మరిన్ని పెట్టుబ డులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహి స్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధు లను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవా రం మెల్బోర్న్లో పారిశ్రామిక పేలు డు పదార్థాల తయారీ, మైనింగ్, ఇ న్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అం తర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యే కంగా భేటీ అయ్యారు.
తెలంగాణలో ‘ఒరికా’ ప్రస్తుత కార్య కలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్ర ణాళికలపై ఈ సమావేశంలో సుదీ ర్ఘంగా చర్చించారు. ‘ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చే సేందుకు అంతర్జాతీయ దిగ్గజ సం స్థలు తెలంగాణ వైపు చూస్తున్నా యి. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటు కు రాష్ట్రం అత్యంత అనుకూలం. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థా యి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థ వంతమైన నాయకత్వం అందుబా టులో ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టె యినబిలిటీ, మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాల ని ఆహ్వానించారు. ‘పరిశ్రమల ఏ ర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహాకర, ప్రగ తిశీల విధానాలు అభినందనీయం. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్వహి స్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజనీ రింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది హై స్కిల్డ్ నిపుణులకు ఉ ద్యోగాలు కల్పించాం.
రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మ రిం త పెరుగుతుందన్నారు. తెలంగా ణ లో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వంతో కలిసి పని చేసేందుకు సి ద్ధంగా ఉన్నామని ఒరికా సంస్థ సీ ఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ తెలిపా రు. ‘ఆస్ బయోటెక్ 2025 ఇంట ర్నేషన్ కాన్ఫరెన్స్’లో కీలకోప న్యా సం చేసేందుకు ఆస్ట్రేలియాకు విచ్చే సిన మంత్రి శ్రీధర్ బాబును కం పెనీ ప్రతినిధులు ఘనంగా సత్కరిం చారు.