Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Surekha : మంత్రి సురేఖ అల్టిమేటం, దేవుడి భూములపై న్యాయపోరాటం, ఆరు మాసాలకోసారి స్టేటస్ చెప్పాలని ఆదేశం 

Minister Surekha : ప్రజా దీవెన, హైదరాబాద్: దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చే యాలని, అసలు న్యాయ పోరాటం స‌రైన రీతిలో ఎందుకు జ‌ర‌గ‌డం లే దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దే వాదాయ శాఖ మంత్రి కొండా సురే ఖ ప్రశ్నల వర్షం కురిపించారు. శని వారం రాష్ట్ర సచివాలయంలోని దే వాదాయ శాఖ మంత్రి పేషీలో ఎం డోమెంటు గవర్నమెంటు ప్లీడర్ల స మావేశం నిర్వహించారు. ఈ స మా వేశంలో మంత్రి సురేఖ మాట్లాడు తూ ఎండోమెంటు కేసుల విషయం లో న్యాయవాదులతో ప్రతి ఆరు నె లలకొక సారి సమావేశంపెట్టి స్టేటస్ చెప్పాలని ఆమె ఎండోమెంటు శాఖ అధికారులను ఆదేశించారు.

దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టాల్సిన అవసరం ఉంద ని మంత్రి నొక్కి చెప్పారు. ఎండో మెంటు భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కేసుల పురోగ‌తిని మంత్రి సమీక్షించారు. ఎండోమెంటు ప్లీడ‌ర్ల ప‌నితీరుపై మంత్రి సురేఖ తీ వ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దేవు డి భూములు కాపాడ‌టంలో ఎందు కు జాప్యం జ‌రుగుతుంద‌ని నిల‌దీ శారు. త‌న ముందు వాదించిన‌ట్టు ఇక్క‌డ కోర్టులో వాదించ‌లేక‌పోతు న్నార‌ని మంత్రి అడిగారు. ఈ స‌ మావేశంలో ఎండోమెంటు ప్రిన్స్ ప‌ ల్ సెక్ర‌ట‌రీ శైల‌జ రామ‌య్య‌ర్‌, యా దగిరిగుట్ట ఈవో వెంకటరావు, క‌మి ష‌న‌ర్లు క్రిష్ణ ప్రసాద్, క్రిష్ణవేణి, ఎండో మెంటు శాఖ గవర్నమెంటు ప్లీడర్ (జీపీ) బీఎం నాయక్, ఏజీపీ శైలజ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

దేవుడి భూములు కాపాడ‌టంలో లీ గ‌ల్ టీం పాత్ర చాలా కీల‌క‌మైందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తాను దేవాదాయ శాఖ మంత్రి అయి రెం డు సంవ‌త్స‌రాలు అయింద‌ని ఇప్ప‌ టికీ కేసులు ఏం గెలిచామో తెలియ‌ డం లేద‌ని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎన్ని కేసులు గెలిచామో వివ‌రించాల‌ని చెప్పారు. అసలు కేసుల విషయంలో అప్డేట్ కోసం అడిగితే డిపార్టుమెంటులో ఎవ‌రు చెప్ప‌ లేక‌పోవ‌డం న్యాయ విభాగం అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డం ఏంట‌ని మంత్రి ప్ర‌శ్నించారు. మ‌న దేవుడి భూములు మ‌నం ద‌క్కిం చుకోవాలన్నారు. దూర‌దృష్టితో కే సులు ప‌రిష్క‌రించుకోవాలన్నారు. ఏ కేసుల మీద న్యాయ పోరాటం చేశారో వాటిని ప‌రిష్కరించ‌డంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర‌ య్యాయో మంత్రి సురేఖ న్యాయ వాదుల‌ను అడిగారు.

మంత్రి ప్రశ్నకు సమాధానంగా 200 2 నుంచి 2025 వ‌ర‌కు 1,500 కేసు లు పెండింగులో ఉన్నాయ‌ని తెలి పారు. ఈ కాలవ్య‌వ‌ధిలో 543 కోర్టు కేసుల‌ను డిస్పోజ్ చేసిన‌ట్టు ప్రభు త్వ ప్లీడర్లు వివ‌రించారు. కేసుల్లో పురోగ‌తికి సంబంధించిన అంశా లు, జ‌డ్జిమెంట్ కాపీ ఎండోమెంటు శాఖ సెక్ర‌ట‌రీకి అంద‌జేయాల‌ని సూ చించారు. ఎండోమెంటు డిపార్టు మెంటుకు సంబంధించిన కేసుల్లో రీట్ ప‌డిన ద‌గ్గ‌రి నుంచి కేసు పూర్త‌ య్యేవ‌ర‌కు ఎలా ముందుకు వెళు తున్న‌ది వివ‌రించాల‌ని చెప్పారు. ఎండోమెంటు భూములు కాపాడ‌ టంలో వారిదే కీల‌క పాత్ర గుర్తు చే శారు. ఎండోమెంటు ట్రిబ్యూన‌ల్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్ర‌స్టీల‌కు సంబంధించి న కేసుల్లో గ‌ట్టిగా వాదించాలని మంత్రి నొక్కి చెప్పారు.

ఆర్కియాల‌జీ డిపార్టుమెంటు ద‌గ్గ‌ర వివ‌రాలు సేకరించాలని ఆ సమా చారంను సాక్ష్యంగా తీసుకోని వె ళ్ళాలన్నారు. అందుకోసం ఒక ఎక్స్‌ ప‌ర్ట్ క‌మిటీ నియ‌మించాల‌ని చెప్పా రు. దైవ చింతన క‌ల్గిన వ్య‌క్తులు ఈ ప‌నిలో నిమగ్నమైతే మంచిద‌ని గు ర్తు చేశారు. ఇంట్రిమ్ ఆర్డ‌ర్స్‌లో పు రోగతి విష‌యంలోనూ మంత్రి, అధి కారులు న్యాయ నిపుణుల‌ను అడి గారు. ఇట్రిమ్ ఆర్డ‌ర్స్ విష‌యంలో త‌మ డిపార్టుమెంటును అల‌ర్ట్ చే య‌క‌పోతే ఇబ్బందులు త‌లెత్తు తు న్నాయ‌ని ఎండోమెంటు ఉన్న‌తాధి కారులు లేవ‌నెత్త‌డంతో వాటిని ఎ ప్ప‌టిక‌ప్పుడు ఎదుర్కొవ‌డానికి ఒక మెకానిజం ఏర్పాటు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. అందుకు ఏం చేస్తే బాగుంటుందో త‌రువాతి స‌మా వేశంలో తెల‌పాల‌న్నారు. ఎండో మెంటు కేసుల్లోని కంటెప్ట్ ఆఫ్ కోర్టు అంశాలు తీవ్రంగా ఇబ్బందులు ఏ ర్ప‌డుతున్నాయ‌ని అన్నారు. వీటి విష‌యంలో గౌర‌వ హైకోర్టుల‌ను పి లిచేదాకా ఎందుకు తీసుకెళ్ళాల‌ని మంత్రి అడిగారు.

ఈ విష‌యంలో న్యాయ విభాగ టీం, వారి కింద వ్య‌వ‌స్థ స‌రైన టైం లో ఎండోమెంటు ఉన్న‌తాధికారుల‌ ను అల‌ర్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బం దులు ఉండ‌వ‌ని చెప్పారు. భూము లకు సంబంధించిన అంశాలు, టెం పుల్ ఎంప్లాయీస్ స‌ర్వీసు వ్య‌వ‌ హారాలు కూడా ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌న్నారు. అప్పుడే మన డిపార్టుమెంటుకు అనుకూలంగా వ‌ స్తాయ‌ని తెలిపారు. అయితే, వ‌చ్చి న ఆర్డ‌ర్స్ ను అమ‌లు ప‌రిచేందుకు కూడా ఒక వ్య‌వ‌స్థ ఉండాల‌ని మం త్రి అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భు త్వ అనుమ‌తితో ప్ర‌త్యేక టాస్క్ ఫో ర్స్ ఏర్పాటు చేయాల‌ని మంత్రికి చె ప్ప‌గా అందుకు కావాల్సిన ప‌నులు చేయాల‌న్నారు. సివిల్ స‌ప్ల‌య్ డి పార్ట‌మెంటులో ఉన్న మాదిరిగా ఉం డాల‌న్నారు. కౌంట‌ర్లు వేయ‌డంలో కూడా ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించొ ద్ద‌న్నారు. కింది స్థాయి ఈవోలు కూ డా అందుకు సహ‌క‌రించాల‌న్నారు. ఎవ‌రైనా స‌హ‌క‌రించ‌క‌పోతే ఎండో మెంటు సెక్ర‌ట‌రీ దృష్టికి తీసుకురా వాల‌న్నారు.

దేవుడి భూముల జోలికిస్తే పీడీ యాక్టులు పెట్టేందుకు వెన‌కాడొద్ద‌ని అధికారుల‌కు చెప్పారు. ఎండోమెం టు చ‌ట్టం మీద అధికారుల‌కు ట్రై నింగు క్లాసులు నిర్వ‌హించాల‌ని మంత్రి చెప్పారు. జిల్లాకో లీగ‌ల్ ఆఫీసుర్ ను నియ‌మించాల‌ని అ న్నారు. హైకోర్టుకు కూడా లైజ‌న్ ఆ ఫీస‌ర్ ను నియ‌మించాల‌ని ఈవోల నుంచి ఒక‌రు ఉండాల‌ని న్యాయ వి భాగ టీం సూచించ‌గా మంత్రి అను మ‌తించారు. వెంట‌నే అందుకు సం బంధించిన ప్ర‌పోజ‌ల్ త‌న‌కి పంపిం చాల‌ని పేర్కొన్నారు.