Military College: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యో గాలు ఇప్పిస్తామంటూ ఆశచూపి నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజు తూ మోసాలకు పాల్పడే మాయగా ళ్ల ఆగడాలు నానాటికీ పెరిగిపోతుం ది. నకిలీ వీసాలు, జాబ్ ఆఫర్ లెట ర్లు ఇచ్చి అమాయకులను నట్టేట ముంచుతున్నారు కేటుగాళ్లు. తా జాగా అలాంటి ఘరానా మోసమే సికింద్రాబాద్లో వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువ తను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నా రు. ఎయిర్ ఫోర్స్ టీ షర్ట్స్ ధరించి సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలోకి దూరారు ఆగంతకులు.
లోపలికి వెళ్లాక వీరి ప్రవర్తన అనుమానా స్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది ప్రశ్నించారు.సికింద్రాబాద్ పరిధిలోని ఎంసీఈఎంఈలోని టెక్నో చౌక్ గేటు నుంచి నలుగురు వ్యక్తులు నేవీ అధికారులమంటూ నకిలీ గుర్తింపు కార్డుతో చొరబడటం కలకలం రేపుతోంది. క్యాంటీన్, ఆర్మీ రహస్య ప్రాంతాల వద్ద ఫోటో లు, వీడియోలు తీస్తుండగా భద్రతా సిబ్బంది దుండగులను అడ్డుకున్నా రు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ను పరిశీలించగా అవి నకిలీవని ని ర్ధారణ అయింది.
దీంతో లెఫ్టినెంట్ కల్నల్ వెంటనే పోలీసులకు ఫిర్యా దు చేశారు.ఇద్దరు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే తా ను నేవీ అధికారినని నమ్మించేం దుకు తన ముఠాతో కలిసి నకిలీ ఐడీ కార్డులతో మిలిటరీ కాలేజీలోకి ప్రవేశించాడు. ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ధరించి ఉండటంతో గేటు దగ్గర ఉ న్న సిబ్బంది కూడా వాళ్లని ఆపలే దు. అలా కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగులు మిలటరీ క్యాంటీన్ వద్ద వీడియోలు తీయ డం మొదలుపెట్టారు. ఇది గమ నించిన భద్రతా సిబ్బంది అనుమా నం రావడంతో వారిని ప్రశ్నించారు. గుర్తింపు కార్డులు చెక్ చేయగా అవి నకిలీవని తేలింది. వెంటనే తిరుమ లగిరి పోలీసులకు నిందితులను అప్పగించారు. అయితే, నలుగురు నిందితులు ఆర్మీ రహస్య ప్రాంతా లను చిత్రీకరించడంతో మరేదో కా రణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.