Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MJF : ఎం జె ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీ కృషి

*ఏబిసిడి వర్గీకరణ ధ్యేయంగా మాదిగ జర్నలిస్టులు పనిచేయాలి

MJF : ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో బుధవారం ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి నాగరాజు అధ్యక్షతన ఎం జె ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ధ్యేయంగా.. ఫిబ్రవరి 7వ తారీకు జరిగే లక్ష డప్పులు వేల గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ. సమావేశంలో ముఖ్యమంత్రులు మాట్లాడారు అనంతరం కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కోదాడ నియోజకవర్గ అధ్యక్షునిగా చెరుకుపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా తమలపాకుల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా చీమ చంద్రశేఖర్, మాతంగి సురేష్ కోశాధికారిగా మందుల రాంబాబు, సహాయ కార్యదర్శిగా ,కుడుముల శివ, ఎంజెఎఫ్ కోదాడ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఏపూరి సునీల్ రత్నాకర్ ,ఉపాధ్యక్షులుగా కలకొండ బుచ్చి రాములు ,కార్యదర్శిగా నేలమర్రి శ్రీకాంత్, గౌరవ సలహాదారులుగా బంక వెంకటరత్నం ,తోళ్ల గురునాథం లను ఎన్నుకున్నారు.

    ఈ సందర్భంగా నూతన కమిటీకి రాష్ట్ర నాయకులు పడిశాల రఘు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నూతన కమిటీని పూలమాలలతో. శాలువులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళూరి చరణ్ , సృజన్, సన్నీ డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.