–రైతులతో ముఖాముఖి కార్యక్ర మంలో ఎమ్మెల్యే బాలు నాయక్
MLA Balu Naik:ప్రజా దీవెన, చింతపల్లి: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నెల్వలప ల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో “రైతు నేస్తం – రైతులతో ముఖాముఖి” టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనం గా నిర్వహించబడింది. ఈ కార్య క్రమంలో దేవరకొండ శాసన స భ్యులు నేనావత్ బాలు నాయక్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి పాల్గొని రైతులతో నేరుగా సంభా షిoచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మా ట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం అమలు చేస్తున్న అనేక ముఖ్యమైన పథకాలను వివరించా రు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధి, ఎరువుల, విత్తనాల సర ఫరా, మార్కెట్ సదుపాయాలు, రు ణ మాఫీపై ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యల గురించి వివరించారు.
అనంతరం రైతుల నుంచి ప్రత్య క్షంగా సమస్యలను విని, వాటి పరి ష్కారానికి తక్షణమే చర్యలు తీసు కుంటామని ఎమ్మెల్యే బాలు నాయ క్ హామీ ఇచ్చారు. సీఎం సంకల్పం తో రాష్ట్రంలో వ్యవసాయం లాభ సాటిగా మారేందుకు చేపడుతున్న చర్యలను రైతులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, రైతుల మధ్య నేరుగా సమీక్షా వేదిక ఏర్పడడం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, ఆర్టీఓ రమణారెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ భవాని పవన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు తదిత రులు పాల్గొన్నారు.