— మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
MLA Bathula Lakshma Reddy : ప్రజా దీవెన మిర్యాలగూడ:ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇంది రమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడమే త మ ప్రభుత్వ ధ్యేయమని మిర్యా లగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం అ యన నల్గొండ జిల్లా మిర్యాల గూ డ నియోజకవర్గం పరిధిలోని మి ర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలోఇండ్లు లేని 80 మంది ని రుపేదలకు ఎం ఎల్ సి శంకర్ నా యక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఇండ్ల పట్టాలను పంపిణీ చే శారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉ ద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లా డుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాల న్నింటిని నెరవేరుస్తున్నదని తెలిపా రు. ముఖ్యంగా 6 గ్యారెంటీలను అ మలు చేసి ప్రజా ప్రభుత్వమని ని రూపించుకుంటున్నదని చెప్పారు.
ప్రత్యేకించి లక్ష్మీపురంలో నిరుపేద లకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకుగా ను 2022 లో 437 సర్వే నంబర్లో నాలుగు ఎకరాల 37 కుంటల భూ మిని భూమి కొనుగోలు పథకం కిం ద కొనుగోలు చేసినప్పటికీ గత ప్ర భుత్వం అప్పటినుండి పెండింగ్ లో పెట్టడం జరిగిందని తెలిపారు. తా ను ఎం ఎల్ ఏ అయిన తర్వాత గుట్టలతో నిండి ఉన్న ఈ స్థలాన్ని చదును చేయించి, లే అవుట్ ఏ ర్పాటు చేసి పట్టాలివ్వడం జరిగిం దన్నారు. ఇందుకు కృషి చేసిన స్థా నిక రెవెన్యూ అధికారులు సబ్ కలె క్టర్, తహసిల్దార్ ల పాత్ర మరువ లేనిదన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం లో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేనివిధంగా 80 మంది నిరుపేదల కు ఇంటి పట్టాలివ్వడం సంతోషం గా ఉందన్నారు. పట్టాలు ఇచ్చిన ఈ ఇంటి స్థలాలలోనే ఇందిరమ్మ ఇండ్లను సైతం నిర్మించి. ఇస్తామని, ఇందిరమ్మ కాలనీగా ఏర్పాటు చే స్తామని చెప్పారు. దీనిని పైలెట్ ప్రా జెక్టుగా తీసుకొని పట్టాలు పొందిన వారందరికీ ఇండ్లు కట్టిస్తామని తెలి పారు. ఎం ఎల్ సి శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మి ర్యా లగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ తహసి ల్దారు హరి తదితరులు ఉన్నారు.