— మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
MLA Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన, చండూరు: మునుగో డు నియోజకవర్గo పరిధిలోని కనగల్ నుంచి మాల్ వరకు ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో రోడ్డు విస్తరణలో కోల్పో తున్న ఇండ్లను మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. బంగారుగడ్డ గ్రా మ పరిధిలో డ్రైనేజీ నిర్మాణంతో క లుపుకొని 66 ఫీట్ల వెడల్పుతో రోడ్డు ను అభివృద్ధి చేస్తున్న సందర్భంగా రోడ్డు వెడల్పులో పూర్తిగా ఎన్ని గృ హాలు పోతున్నాయి, పాక్షికంగా ఎన్నిగృహాల వారికి ఇబ్బంది అవు తుందని తీసుకునేందుకు బంగారు గడ్డ గ్రామంలో పరిస్థులను ఎమ్మెల్యే
క్షుణ్ణంగా పరిశీలించారు.
అంతకు ముందు మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను బంగా రుగడ్డ రోడ్డు వెడల్పులో గృహాలు కోల్పోతున్న బాధితులు కలిసితమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితు ల సమస్యలు విని స్వయంగా వ చ్చి పరిశీలిస్తానని వెంటనే బయ లుదేరి వచ్చి బంగారుగడ్డలో ఇండ్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదోళ్లకి అ న్యాయం చేసి అభివృద్ధి చేయం, పేదోళ్లకు న్యాయం చేసుకుంటూనే అభివృద్ధి చేస్తామని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
తమ సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పేదోళ్లకు అన్యా యం జరిగే అభివృద్ధి చేయమని, పేదలకు న్యాయం చేస్తూనే అభివృ ద్ధి జరుపుతామని హామీ ఇచ్చా రు. బంగారుగడ్డ గ్రామ పరిధిలో డ్రైనేజీ నిర్మాణంతోపాటు 66 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులు జరగబోతున్న నేపథ్యంలో ఇల్లులు కోల్పోతున్న నిరుపేదలకు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామ పరిధి లో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు.