Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Komatireddy Rajagopal Reddy : కస్తూరిబా విద్యార్థినులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భరో సా,మౌలిక సదుపాయాలు కల్పిస్తా మంచిగా చదువుకోండి

MLA Komatireddy Rajagopal Reddy :

ప్రజా దీవెన, సంస్థాన్ నారాయణ పురం: యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండల కేంద్రం లో ఉన్న కస్తూరిబా బాలికల పాఠ శాలలో రూ. 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణా నికి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల మొ త్తం పరిశీలించిన ఆయన విద్యార్థి నుల సంఖ్యకు సరిపడ తరగతి గ దులు, డార్మెటరీ హాల్స్, బాత్రూం లు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్ లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని ఆరా తీశారు. పాఠశాలలో ఎ టువంటి సమస్యలు ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకు న్నారు.

ప్రతి తరగతి గది, డార్మెటరీ హాల్ లను పరిశీలించి విద్యార్థినుల సం ఖ్యాకు సరిపడా అదనపు తరగతి గదుల నిర్మాణం, నూతన డార్మెటరీ హాల్స్ తో పాటు 12 మంది విద్యార్థి నులకు ఒక్కో టాయిలెట్, బాత్రూ మ్స్ చొప్పున ఉండేలా సరిపడా ని ర్మిస్తామని హామీ ఇచ్చారు. కస్తూరి బా బాలికల పాఠశాల పరిసరాలని కలియ తిరుగుతూ ప్లే గ్రౌండ్ ఎలా ఉండాలి ఎటువైపు డార్మెటరీ హా ల్స్, అదనపు తరగతి గదులు ఉం డాలనే అంశం పై సంబంధిత అధి కారులతో చర్చించి పలు సూచన లు చేశారు.

ప్రభుత్వ విభాగానికి చెందిన ఇంజ నీర్లు వేసిన ఇంజనీర్ ప్లానను పరి శీలించి విద్యార్థునుల భవిష్యత్తు కో సం మౌలిక సదుపాయాల అభివృ ద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయించి ప నులు మొదలు పెడతామన్నారు.
ఇప్పటికే తన వ్యక్తిగత ఇంజనీరింగ్ బృందంతో ఎటువంటి మౌలిక సదు పాయాలు అవసరం అనే విష యా లను స్వయంగా తెప్పించుకున్న ఎ మ్మెల్యే ఆ వైపుగా అభివృద్ధి చే య డానికి ముందుకు వెళ్తున్నామన్నా రు.

రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల మౌలిక వ సతుల అభివృ ద్ధిలో రాజీపడే ప్రసక్తి లేదన్న ఆయ న ఇప్పటికే మర్రిగూడెం కస్తూరిబా లో 1 కోటి 25 లక్షల రూపాయల సొంత నిధులతో 9 అదనపు తరగ తి గదులు, 30 కి పైగా బాత్రూం లు, టాయిలెట్స్ నిర్మాణం తో పా టు సరిపడా ఆటస్థలాన్ని కూడా త యారు చేసి ఇస్తున్నామని గుర్తు చే శారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ పా ఠశాలలు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడా నికి సాయశక్తులా కృషి చేస్తున్నామ న్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నా యకులతోపాటు కస్తూర్బా సిబ్బం ది, సంబంధిత శాఖ ఇంజనీర్ లు పాల్గొన్నారు.