–దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
MLA Nenavat Balu Naik: ప్రజా దీవెన, దేవరకొండ:నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏకే బిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూని ర్వాసితులకు, పెండ్లిపాకల ఓపెన్ కెనాల్ భూ నిర్వాసితులకు ప్రభు త్వం నుంచి మంజూరు అయి న నష్టపరిహారం చెక్కులను లబ్ధిదా రులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనా వత్ బాలు నాయక్ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ కె బి ఆర్ ప్రాజెక్టు, ఏఎంఆర్ ఎస్ ఎల్ బి సి కెనాల్ ద్వారా భూములు కో ల్పోయిన రైతులకు ప్రభుత్వం నుం చి మంజూరు అయిన నష్టపరిహా రం చెక్కులను అందజేయడం చా లా సంతోషంగా ఉందన్నారు. గుడిపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామానికి చెందిన రైతులు ఏ కే బి ఆర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన 12మందికి గాను 68లక్షల రూపాయల విలువ గల నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
అదేవిధంగా పిఎ పల్లి మండలంలోని బాలాజీ నగర్ గ్రామానికి చెందిన రైతులు ఏఎంఆర్ ఎస్ఎల్ బీసీ కెనాల్ ద్వారా భూములు కోల్పోయిన 45 మందికి గాను 11.6 కోట్ల రూపాయల విలువ గల నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పిఏ పల్లి, గుడిపల్లి మండలం సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్టు మార్గదర్శకం గా నిలుస్తుందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించడం జరుగుతుందని,10 సంవత్సరాలు ఏ కే బి ఆర్ ప్రాజెక్టు, ఎస్ ఎల్ బి సి కెనాల్ భూనిర్వాసితుల గురించి పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు పని పట్టుకుని మాపైన బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ప్రజలు వాళ్ళ మాటలపై అప్రమత్తంగా ఉండాలని, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, మీ ప్రతి కష్టం ముందు నేను నిలబడి ఉంటానని, ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నన్ను నేరుగా కలవవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
చిలకమర్రి, బాలాజీ నగర్ గ్రామానికి చెందిన 57 కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయినా పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, పరిహారం అందని వారు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదనీ మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, ఆర్ డి ఓ రమణా రెడ్డి, ఈఈ డివిజన్ ఐదు కేతావత్ నెహ్రూ నాయక్, ఏ కే బి ఆర్ డివిజన్ -నాలుగు డి ఈ నాగయ్య, రమేష్, ఏఈలు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, భూ నిర్వాసితులకు తదితరులు పాల్గొన్నారు.