MLA Padmavathi Reddy :ప్రజా దీవెన,కోదాడ: నడిగూడెం మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షురాలు నేలమర్రి వెంకటమ్మ భర్త నేలమర్రి ప్రసాద్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని రామాపురంలో స్వర్గీయ నేలమర్రి ప్రసాద్ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం మాట్లాడుతూ ప్రసాద్ గ్రామంలో పార్టీ పటిష్టతకు, గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్,గోసుల రాజేష్ మొక్కా బిక్షపతి,దేవభత్తిని రమేష్ ప్రసాద్,దున్నా శ్రీనివాస్,గుజ్జా అంజి,గడ్డం మల్లేష్ యాదవ్,వల్లెపు శ్రీనివాస్,భారీ వెంకన్న, లంజపళ్లి సైదులు,కుటుంబ సభ్యులు,బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.