Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavati Reddy: నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు…….

నీటి సంఘం చైర్మన్ గా రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి.: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

MLA Padmavati Reddy: ప్రజా దీవెన, కోదాడ: రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు అని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్ లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని గుడు గుండ్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరావు సంతాప సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి నిజాయితీలు కరువైన ఈ రోజుల్లో గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ప్రజలకు సేవ చేశారని రైతుల కోసం సమాజ కోసం ఇంకా ఎంతో సేవ చేయాల్సి ఉన్న హనుమంతరావు మన మధ్యన లేకపోవడం బాధాకరం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు ఎక్కడా లేని అభిమానం అన్నారు. నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మాజీ సర్పంచులు పార సీతయ్య, ఎర్నేని బాబు,తొండపు సతీష్, నంబూరి సూర్యం, మల్లెల రాణి, డాక్టర్ సుబ్బారావు, రామారావు, ఓరుగంటి ప్రభాకర్, ముత్తినేని సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు కనకమ్మ, ఉన్నం శ్రీనివాసరావు, లత, శ్రీ లక్ష్మీ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు……….