*వ్యాపార వాణిజ్య సంస్థల ఏర్పాటు తో పట్టణ అభివృద్ధి.
వినియోగదారులకు మెరుగైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి: ఎమ్మెల్యే
MLA padhmavathi reddy: ప్రజా దీవెన, కోదాడ: యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని వారి కాళ్లపై వారి నిలబడి జీవిస్తూ పది మందికి జీవనోపాధి కల్పించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోనీ హుజూర్ నగర్ రోడ్డు లోని పాత సాయి బిందు రెస్టారెంట్ బిల్డింగ్ లో నిర్వహకులు నడిగూడెం మాజీ ఎంపీపీ కాసాని విమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. రెస్టారెంట్ యజమానులు స్థానికులకు ఉపాది అవకాశాలు కల్పించి నిరుద్యగులకు జీవనోపాధి కల్పించాలని తెలిపారు వ్యాపార వాణిజ సంస్థల ఏర్పాటుతో పట్టణ అభివృద్ధి జరుగుతుందని.
జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ యజమానులు నాణ్యమైన ఆహార పదార్థాలు, సేవలు అందజేసి పేరు సంపాదించుకోవాలని తెలిపారు నాణ్యమైన సేవలతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరాలకు ధీటుగా రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ముత్తావరపు పాండురంగారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, బత్తిని రమేష్, గడ్డం మల్లేష్ యాదవ్, బూతుకూరి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.