MLA Padmavati Reddy : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మహిళాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
MLA Padmavati Reddy : ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తీర్ణలో భాగంగా కోదాడ శాసన సభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మంత్రివర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి మహిళ ఎమ్మెల్యేకు స్థానం కల్పించాలని కోదాడ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు అన్నారు గురువారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారని తెలిపారు .
కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాలలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దంపతులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రెండు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుర్తు చేశారు నిస్వార్థపరురాలు నీతి నిజాయితీలకు మారుపేరుగా కోదాడను అభివృద్ధి చేస్తున్న పద్మావతి రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించి మహిళలకు గౌరవం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ వార్డ్ కౌన్సిలర్లు గంధం యాదగిరి పెండ వెంకటేశ్వర్లు కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్ ఓకే మదర్ సాహెబ్ శెట్టి సుశీల రాజు ఎస్కే షఫీ కర్రి శివా సుబ్బారావు కైలా స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు