MLA Padmavati Reddy : ప్రజా దీవేన, కోదాడ:ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్ట్ రఘు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు ఇటీవల జర్నలిస్టు రఘు ఆనారోగ్యంతో మృతి చెందినాడు ఈ సందర్భంగా ఆదివారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి రఘ నివాస గృహం నాకు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు కుటుంబానికి సంతాపము సానుభూతి తెలియజేశారు అనంతరం అమె మాట్లాడుతూ రఘు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి జర్నలిస్టులు పిడమర్తిగాంధీ , చెరుకుపల్లి శ్రీకాంత్, చీమ చంద్రశేఖర్ , ఏపూరి సునీల్ రత్నాకర్,తోళ్ళ గురునాథం పూర్ణచంద్రరావు వెంకటరత్నం కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు