Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

government welfare schemes : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి // ఎమ్మెల్యే సామేల్

government welfare schemesl : శాలిగౌరారం జూన్ 21 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.శాలిగౌరారం లోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను ఎమ్మెల్యే సామేల్ అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా అమలు చేస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇల్లు నిర్మించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి,తహసీల్దార్ పి. యాదగిరి,మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డీ, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా, మండల పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డీ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, సింగల్ విండో చైర్మన్ తాల్లూరి మురళి, వైస్ ఛైర్మెన్ చామల మహేందర్ రెడ్డీ,నాయకులు నోముల జనార్దన్, చింత ధనుంజయ,బొల్లికొండ గణేష్, పుల్లూరి దేవేందర్, బొడ్డు నగేష్, లోడే సత్తయ్య తదితరులు పాల్గొన్నారు