Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC: వైసీపీ ఎమ్మెల్సీ కి భారీ షాక్

— ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములు స్వాధీనం

MLC:ప్రజా దీవెన, అమరావతి: వైసీపీకి (ycp)చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న ప్రభుత్వ భూములు శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. కాజులూరు మండలం పల్లిపా లెం లో 35 ఎకరాల భూములు తోట కుటుంబం అధీనంలో ఉన్నా యి. ఇవి ప్రభుత్వ భూములని (Government lands)అధికారులు చెబుతున్నారు. ఇందులో ఏడెకరాల భూములకు సంబంధించి ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉంది .మిగిలిన 28 ఎకరాల భూములపై ఎలాంటి కేసులు లేవు. అవి ల్యాండ్ సీలింగ్ భూములుగా ఎప్పటినుంచో అధికారులు చెబుతున్నారు.కానీ వైసిపి ప్రభుత్వ హయాంలో ఆ భూముల జోలికి అధికారులు వెళ్ళలేదు.

కాగా శనివారం జిల్లా కలెక్టర్ షామ్ మోహన్ సగిలి, ఆర్డిఓ ఇట్ల కిషోర్, రెవిన్యూ అధికారులు, పోలీసుల బందోబస్తు (Arrangement of Kishore, Revenue Officers and Police)మధ్య ఆ భూముల వద్దకు వెళ్లారు. 28 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. ఒకేసారి 28 ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవడం జిల్లాలో ఇదే మొదటిసారిగా రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. వైసీపీ (ycp)హయంలో భూములు అన్యాక్రాం తమైనా పట్టించుకోలేదు. ఒక్కొ క్కటిగా కూటమి ప్రభుత్వం ఇలాం టి అవినీతి ఆక్రమాలు వెలుగులోకి తీస్తోందంటూ నాయకులు వ్యా ఖ్యానించారు.