–పోలవరం ముంపు ఐదు గ్రామలు తెలంగాణకు అప్పగించాల్సిందే
–ఈ నెల 25న ‘ప్రగతి ఎజెండా స మావేశంలో ప్రకటన చేయాలి
–తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ప్రజా దీవెన, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న ఆ అయిదు పంచా యితీల కోసం అవసరమైతే న్యా య పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఉమ్మడి రా ష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. పోలవ రం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవు తున్న ఐదు గ్రామ పంచాయ తీల ను తిరిగి తెలంగాణకు అప్పగిం చా లని కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛ త్తీస్ గడ్ నాలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో నిర్వహించతలపెట్టిన ‘ప్రగతి ఎజెండా’ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయాలని ఆమె కో రారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ జాగృతి ఆ ధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసి న రౌండ్ టేబుల్ సమావేశంలో కవి త ఈ మేరకు డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అం శాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్పుడే తాము వ్యతిరేకించామని క విత గుర్తుచేశారు. అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రాజెక్టును ఆ పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్ర భుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించిందని ఆమె అ న్నారు.
ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గ డ్ సీఎంలతో ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ నిర్వహిస్తున్న సమావేశం లో ఈ అంశాన్ని చర్చించాలని,ఐదు గ్రా మాలను వెనక్కి తీసుకొచ్చేలా సీ ఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చే యాలని కవిత అన్నారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉం టుందని అభిప్రాయం వ్యక్తం చేశా రు. లేదంటే ఎప్పుడైనా భారీ వరద లు వస్తే అన్ని గ్రామాలు ముని గిపో తాయన్నారు. పోలవరం వల్ల భద్రా చలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందన్నారు.
ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రా చలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని, ఆవెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆం ధ్రాకు పోయిందన్నారు. దేవుడేమో తెలం గాణలో ఉన్నాడని అక్కడ పట్టించు కునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందన్నారు. దే వుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పోలవరం ముం పుపై సంయుక్త సర్వే నిర్వ హించాలని కవిత అన్నారు.
అవసరమైతే అయిదు పంచా యితీలపై న్యాయపోరాటం.. ఆ అయిదు పంచాయితీల కోసం అవ సరమైతే న్యాయ పోరాటం చేస్తామ ని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మ డి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృ తి సుప్రీం కోర్టును ఆశ్రయించింద న్నారు. 2014లో ప్రధాని మోదీ మొట్ట మొదటి క్యాబినెట్ సమావే శంలో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ను ఆమోదిం చి తెలంగాణకు అన్యాయం చేశార ని విమర్శించారు. ఆ ఏడు మండ లాలను అన్యాయంగా ఏపీలో కలి పారన్నారు. లోయర్ సిలేరు విద్యు త్తు ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పజె ప్పారని బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీ సుకున్నారని విమర్శించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూ ర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెం టులో మేము గళమెత్తామన్నారు. కేసీఆర్ బంద్కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా లేద న్నారు. పోలవరం స్పిల్ వే సామ ర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుం దని, భద్రాచలం రామాలయం ము నిగిపోయే ప్రమాదంలో ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.