Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mlc Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

— బస్ పాస్ చార్జీల పెంపునకు నిరసనగా జాగృతి ఆందోళన
–బస్ భవన్ ముట్టడిలోఎమ్మెల్సీ స హా జాగృతి నాయకులు అరెస్ట్

Mlc Kavitha : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఆర్టీసీ విద్యార్థులు, జనరల్ బస్ పాస్ల చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ము ట్టడికి యత్నించారు. భారీసంఖ్య లో కార్యకర్తలతో కలిసి కవిత బైఠా యించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఎమ్మెల్సీతో పాటు కార్య కర్తలను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడు తూ ఆర్టీసీ పెంచిన ధరలను వెంట నే ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు. విద్యార్థులు, చిరు ద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం ప డుతుందని, బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మో పారని మండిపడ్డారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవా టు పడిందన్నారు. కాగా కవితను తొలుత చాంద్రాయణగుట్ట పీఎస్ కు తరలించిన పోలీసులు అనంత రం కంచన్బాగ్ స్టేషన్ కు తీసుకెళ్తు న్నట్లు చెప్పారు. ఎక్కడికి తీ సుకె ళ్తున్నారో పోలీసులు స్పష్టంగా చె ప్పడం లేదని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.