Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Ketawat Shankar Nayak: రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి

–ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

–నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

–పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శంకర్ నాయక్

MLC Ketawat Shankar Nayak: ప్రజాదీవెన నల్గొండ: భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు.పార్టీ శ్రేణులంతా రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.