*కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం
కోదాడ క్రీడా పోటీల స్మృతులు ఆయుష్షును పెంచుతాయి.శ్రీపాల్ రెడ్డి
MLC Pingili Sripal Reddy: ప్రజా దీవేన,కోదాడ:ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల కు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో గత మూడు రోజులుగా హోరా హోరీగా నడుస్తున్న విశ్రాంత ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుండి వయస్సుతో సంబంధం లేకుండా క్రీడలకు హాజరైన విశ్రాంత ఉద్యోగులు అభినందనీయులన్నారు. క్రీడలు గెలుపు ఓటముల కోసం కాకపోయినా కోదాడలో విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడల స్మృతులు ఆయుష్షుని పెంచుతాయి అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగిన క్రీడలు సాంస్కృతిక పోటీలు చారిత్రాత్మకంగా నిలుస్తాయన్నారు. పెండింగ్ సమస్యలపై స్పందిస్తూ డిఏలు పిఆర్సి సర్వీస్ రూల్స్ ప్రధానంగా హెల్త్ కార్డులు సాధించే బాధ్యత తనదేనన్నారు.
హక్కుల సాధన కోసం అవసరమైతే జరిగే ఉద్యమ కార్యాచరణకు ముందుంటానన్నారు.పాలకవర్గాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని చేస్తామంటాయని అధికారంలోకి రాగానే పరిస్థితులను బట్టి వ్యవహరిస్తుంటాయన్నారు. ఏది ఏమైనా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గొంతుకను శాసనమండలిలో వినిపిస్తానన్నారు గతంలో పిఆర్టియు అధ్యక్షునిగా ఉండి పెన్షనర్ల క్వాంటం పింఛన్ పై ముఖ్యమంత్రితో మాట్లాడి పింఛన్దారులకు లబ్ధి చేకూర్చామన్నారు ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన హక్కుల కోసం కృషి చేశాను అన్నారు. ప్రస్తుతం తాను ఒక రిటైర్డ్ ఉద్యోగి నే నని విశ్రాంత ఉద్యోగుల కు అండగా ఉంటానన్నారు. ప్రధమంగా రాష్ట్రస్థాయిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య క్రీడలు నిర్వహించి కోదాడకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ఆరు పదులు దాటిన వయసులో రిటైర్డ్ ఉద్యోగుల శక్తియుక్తులను ప్రశంసించారు.
రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల నాలుగు డిమాండ్లు హెల్త్ కార్డులు పిఆర్సి డిఏలు పెండింగ్ బిల్లులు మంజూరు చేయించే బాధ్యతను ఎమ్మెల్సీ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం 15% క్వాంటం తీసుకుంటున్నామంటే పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపాల్ రెడ్డి దే కృషి అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘాన్ని కోదాడ డివిజన్లో ముందుండి నడిపిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్యను అభినందించారు. ఇకనుండి ఏ జిల్లాలో విశ్రాంత ఉద్యోగుల సంఘం వారు క్రీడలు నిర్వహించిన రాష్ట్ర సంఘం నుండి లక్ష రూపాయలు అందిస్తామని ప్రకటించారు.
సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు లు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సామాజిక సేవలను ప్రశంసించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రాష్ట్ర మహిళా ఉద్యోగుల చైర్మన్ ఉమా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జితేందర్ రెడ్డి, తీగల నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ వీరబాబు, భ్రమరాంబికా , రఘు, తదితరులు ఉన్నారు.