Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi: జీర్ణించుకోలేకపోతున్నారు మూడోసారి ప్రధాని కావడం

–కాంగ్రెస్ పై సెటైర్లు విసిరిన ప్రధాని మోదీ

Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కాంగ్రెస్ యేతర నాయకుడు (A non-Congress leader) వరు సగా మూడోసారి ప్రధాని కావడాన్ని హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోంద ని ప్ర‌ధాని మోదీ (modi) విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్‌ గాంధీ సభలో (Rahul Gandhi Sabha) అవమానకర ప్రసంగం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన త ర్వాత తొలిసారిగా మంగళవారం ఎన్డీయే పార్ల మెంటరీ పార్టీ సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని మోదీ (modi) దిశానిర్దేశం చేశారు. ము ఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియ ర్లను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీపై పరోక్షంగా విమర్శ లు గుప్పించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ (rahul) ప్రవర్తించిన తీరు అమర్యాదకరం అని మోదీ అన్నారు. స్పీకర్‌ స్థానాన్ని ఆయన అవమానించారని మండిపడ్డారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దని సూచించారు. పార్టీల కు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్‌ను సం దర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధాను ల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శిం చారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలని ప్రధాని ఎంపీలకు సూచించారు.