Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi: రష్యా తో స్నేహబంధాలు పెంపొందిస్తాం

–రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
–22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం లో ఇద్దరు నేతలు

Modi:ప్రజాదీవెన, ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (punith) ఆహ్వానం మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (Modi)విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈసందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆస్ట్రియాకు వెళ్తారు.

విదేశీ పర్యటకు బయలుదేరే ముందు ఎక్స్ (twitter)​ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ‘రానున్న మూడు రోజులు రష్యా, ఆస్ట్రియాలో (Austria) పర్యటిస్తా. కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటనలు ఉపయోగపడనున్నాయి. అక్కడ నివసించే భారతీయులతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా’ అని మోదీ తెలిపారు.