Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Etela Rajender: కమిటీలు తప్ప చర్యలేవి

— ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ ఈటెల రాజేందర్

MP Etela Rajender: ప్రజా దీవెన, హైద‌రాబాద్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సా క్షిగా మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈ టల రాజేందర్ సిట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం జ రిగిన విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని పేర్కొన్నా రు.

హుజురాబాద్ ఉపఎన్నికల సమ యంలో తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తన ఫోన్ అ నేకసార్లు ట్యాపింగ్ అయ్యిందని చెప్పారు. నాయకుల ఫోన్లను మాత్రమే కా కుండా వారి గన్ మెన్‌ల ఫోన్‌ లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018 లో తాను ప్రభుత్వంలో ఉన్న ప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగింద న్నారు.

2021 ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయం లో తాను ఏ కార్యకర్తతో మాట్లాడి తే వాళ్ల ఇంటికి వెళ్లి పదవులు డ బ్బులు ఆశచూపి ఓడించే ప్రయ త్నం చేశారని రాజేంద‌ర్ తెలిపారు. 2023లో గజ్వెల్‌లో, హుజు రాబా ద్‌లో పోటీ చేసినప్పుడు తమ ఫో న్లు ట్యాప్ చేశారన్నారు.

ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు ని యామకం అక్రమం అని చెప్పారు. తనకు అనుకూలంగా ఉన్నవాళ్లను కేసీఆర్ అప్పట్లో నియమించుకు న్నారని ఆరోపించారు. ఫోన్ ట్యా పింగ్ ఇంకా ఎంతకాలం కొనసాగు తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితుల‌పై ఎప్పుడు చర్యలు తీ సుకుంటారని అడిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై క మిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందు కు చర్యలు తీసుకోవడం లేదని ప్ర శ్నించారు. ఎందుకు నివేదికలను బయటపెట్టడంలేదని ప్రశ్నించారు.