Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MRPS Movement : సమాజహితమే ఎమ్మార్పీఎస్ ఉద్యమతత్వం

–సమాజానికి కృతజ్ఞతగా భవిష్య త్ ఉద్యమ ప్రయాణం
–ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ

MRPS Movement : ప్రజా దీవెన, : సామాజిక ఆర్థిక రాజకీయ అస మానతల లేని నూతన సమాజ నిర్మాణం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసా గిస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరా ట సమితి ( ఎంఆర్పిఎస్) రాష్ట్ర అ ధ్యక్షులు డా: గోవింద్ నరేష్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం టిఎ న్జీవో కార్యాలయంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మాదిగ సమాజానికి దక్కవలి సిన రిజర్వేషన్ హక్కుల కోసం పో రాడుతూనే మరోవైపు నిరాదరణ కు గురైన వర్గాలైన వికలాంగుల వృ ద్దులు వితంతువుల కోసం పోరాడి వారికి పెన్షన్లు సాధించడం జరిగిం ది.గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ పథ కం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమో షన్ల లో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యో గాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజ లకు 6 కిలోల బియ్యం పెంపు మొ దలగు ఫలితాలను ఎమ్మార్పీఎస్ సాధించిందని అన్నారు.

ఈ ఫలాలు కేవలం మాదిగల కో సం చేసినవి కావని , అన్ని వర్గాల సంక్షేమం సా మాజిక బాధ్యతతో చేసిన ఉద్యమలని అని అన్నారు. కాబట్టి సమాజ హితమే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అ న్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అ న్నారు.మాదిగల కోసం ముప్పై ఏ ళ్లుగా జరిగిన రాజీలేని పోరాటం వి జయవంతమై తెలంగాణలో, ఆం ధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు.

ఈ విజయానికి కారణం ఎమ్మార్పీ ఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజ లు అందించిన సహకారమే అని అన్నారు .దేశంలో ఎన్నో కుల ఉద్య మాలు పుట్టినప్పటికీ లక్ష్యం సాధిం చే వరకు ఏ ఉద్యమం నిలబడలేక పోయాయి కాని ఎమ్మార్పీఎస్ మా త్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చే రిందని దానికి సమాజం ఇచ్చిన సహ కారమే ప్రధాన కారణమని అన్నారు.

కనుక సమాజానికి కృతజ్ఞతగా భవి ష్యత్ ఉద్యమ కార్యాచణలో ముం దుకు సాగుతామని అన్నారు . ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవి ర్భావ దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈ మేరకు MSF జాతీయ కార్యదర్శి డాక్టర్ పల్లర్ల సుధాకర్ మాదిగ, జానకి రామ య్య చౌదరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం టు మల్లేపాక వెంకన్న మాదిగ, M JF రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ మాదిగ, MRPS జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ, కూరుపాటి కమలమ్మ, మేడి శంకర్, కందుల మోహన్, Vhps రాష్ర్ట ఉపాధ్య క్షుడు పెరిక శ్రీనివాసులు, జీడిమడ్ల రవీందర్, మడుపు శ్రీనివాస్, బొజ్జ చిన్న, బొజ్జ దేవయ్య, మాసరం వెంకన్న, తరి ఏడుకొండలు, మా చర్ల సుదర్శన్, వంగూరి ప్రసాద్, జలంధర్, సైదులు, చింత ఎల్లయ్య, గిరి, రాజు, తదితరులు పాల్గొన్నా రు.