Murder : ప్రజా దీవెన మేఘాలయ: హనీమూన్ కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో విస్తుపో యే సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. రాజా భార్య సోనమ్ పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించి నట్లు పోలీసుల ప్రాథమిక విచార ణలో వెల్లడైంది. కొత్తగా పెళ్లైన దం పతులు రాజా రఘువంశీ, సోనమ్ గత్ 23న మేఘాలయ హనీమూన్ కు వెళ్లి ఆ తర్వాత అదృశ్యమ య్యారు.
ఈ నెల 2న రాజా మృత దేహం లో యలో కనబడటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ నెల 8న సోనమ్ ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూ ర్ లో పోలీసులకు లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ద ర్యాప్తులో సంచలన విషయాలు బ యటపడ్డాయి. సోనమ్ వివాహేతర సంబంధం వల్లే భర్తను హత్య చే యించింది. రాజ్ కుశ్వాహా అనే వ్య క్తి ఆమె ప్రియుడు గా భావిస్తున్నా రు. ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర ప న్ని, రాజాను చంపించి మృత దేహా న్ని లోయలో పడేసి తప్పించుకు నేందుకు సోనమ్ ప్రణాళిక వేసింద ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్, రాజ్ను అరెస్టు చేసి విచా రిస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగు లోకి వచ్చే అవకాశమున్నట్లు పోలీ సులు తెలిపారు.