Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Atrocious : మానవసంబంధాలు మంటకలుస్తోన్నవి, రాష్ట్రంలో దారుణాలు

Atrocious: ప్రజా దీవెన, హైదరాబాద్: మానవ జీవితంలో మానవసంబంధాలు మంటకలుస్తోన్న హృదయవిదారక సంఘటనలు రోజురోజుకు పెరిగిపో తున్నాయి. ఒక విధంగా ఆలోచిస్తే మనసులు క్షనికావేశం, క్షనిక సుఖం కోసం ఎటు పోతున్నారో అర్థం కాని జుగుప్సాకర పరిస్థితులు కోకొల్లలు గా రోజుకో రీతిలోకళ్ళ ముందు కద లాడుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రస్తుతం చోటుచేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. ఆ క్రమంలో పైన చెప్పు కున్న విధంగా రాష్ట్ర రాజధాని భా గ్యనగరంలో రెండు వేర్వేరు ప్రాం తాల్లో సంఘటనలు జరిగాయి.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూ తురి పట్ల ఓ తండ్రి ప్రవర్తించిన తీ రు చూస్తుంటే అసలు బంధాలు బ తికున్నాయా అనిపిస్తోంది. ఆడబి డ్డలకు తండ్రి అంటే వల్లమాలిన ప్రే మానురాగాలు సర్వసాధారణం. ఒకప్పుడు ఇంటి యజమానితో ఎం తో భయం, బాధ్యతతో ఉండేవా రు.కానీ ఇప్పటి తండ్రులు పిల్లలతో స్నేహంగా ఉంటూ వారి భవిష్యత్తు కు బంగారు బాటలు వేయడం కూ డా సహజంగానే చూస్తూ ఉంటా ము. ఎన్ని కష్టాలొచ్చినా తనలోనే దాచుకుని తమ కన్న బిడ్డలకు మా త్రం ఏ కష్టం రానీయకుండా చూసు కుంటున్నారు కన్న తండ్రులు. కానీ ఇప్పుడు వినబోయే, చెప్పుకోబోయే మానవమృగం గురించి తెలిస్తే అం తే దుర్మార్గుడు అని అనక మానరు. తండ్రంటేనే ఆడపిల్లలు భయపడి పోతారేమో కన్నబిడ్డను రక్షించాల్సి న తండ్రే భక్షకుడిగా మారిన వైనం కామాంధుల చెర నుంచి కాపాడా ల్సిన ఆ తండ్రి బిడ్డ కు అంతులేని దు:ఖాన్ని మిగిల్చాడు.

హైదరాబాద్‌‌లోని బొల్లారం పోలీ స్‌స్టేషన్ పరిధిలో అమానుష ఘట న చోటు చేసుకుంది. తన రక్తం పం చుకుని పుట్టిన కన్న బిడ్డనే చెరబ ట్టాలని ప్రయత్నించాడు ఓ తండ్రి. మద్యం ఎలాంటి వారిని ఎలా మా రుస్తుందో అందరికీ తెలిసిందే. మ ద్యం సేవిస్తే ఎదుట ఉంది భార్యో, కూతురో కూడా తెలియకుండా విచక్షణ మరిచి ప్రవర్తించాడు ఓ తండ్రి. స్థానికంగా ఉంటున్న నాగ రాజు తాగుడుకు బానిసయ్యాడు. ఇంటిని పోషించకపోవడంతో పాటు సంపాదిస్తున్న భార్యను కూడా చిత్ర హింసలకు గురిచేసేవాడు. అంతటి తో ఆగకుండా కన్న కూతురిపట్ల కూడా దారుణంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో కూతురి శరీర భా గాలు తాకి వేధింపులకు గురిచేశా డు నాగరాజు. భయపడిపోయిన కూతురు పెద్ద కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న తల్లి నాగరాజు బారి నుంచి కుమార్తెను రక్షించుకుంది. ఆపై పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ దారుణ ఘటనపై పో లీసులకు ఫిర్యాదు చేసింది.మద్యం తాగి తరచూ తనపై, తన బిడ్డపై వి చక్షణారహితంగా దాడి చేస్తాడని భార్య ఫిర్యాదు చేసింది. బాధితు రాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టారు. అయితే కన్న బిడ్డపై తండ్రే ఇలాంటి దారుణానికి పాల్పడిన ఘ టన స్థానికంగా సంచలనం రేపింది.

మరో సంఘటనలో తల్లిని హతమార్చిన కూతురు …

హైదరాబాద్ నగరంలోని జీడిమె ట్లలో జరిగిన మహిళ అంజలి (39) హత్య కేసులో సంచలన విషయా లు వెలుగు చూసాయి. తాజాగా కేవలం 8 నెలల క్రితమే నల్లగొండకు చెందిన శివ(19) అనే యువకుడి తో ఇంస్టాగ్రామ్ లో కూతురు(16) కు పరి చయం కాస్తా ఆకర్షణగా మారింది. వీరిద్దరి పదో ప్రేమాయ ణం గురించి తెలుసుకున్న తల్లి 8వ తరగతికే ప్రేమ ఏంటని మందలిం చింది. దీంతో వారం క్రితమే శివతో కలిసి బాలిక పరారైంది.

ఆ తర్వాత మూడు రోజుల క్రితమే సదరు బాలిక ఇంటికి తిరిగి వచ్చిo ది. ప్రేమికులిద్దరూ ఏమి ప్లాన్ చేశారో కానీ తల్లి అడ్డు తొలగిం చు కునేందుకు ప్రియుడితో కలిసి హ త్యకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అనుకున్న విధంగానే సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి హైద రాబాద్ కు చేరుకున్న ప్రియుడు శివఇంట్లో అంజలి పూజ చేస్తుం డగా వె నుక నుంచి దాడి చేసి బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని కప్ప గా సుత్తితో తల్లి తలపై కూతురు కొట్టి అపస్మారక స్థితికి చేరు కునే టట్లు చేశారు.

ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కత్తితో నిoధితు డు శివ త మ్ముడు యశ్వంత్(18) కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చే శారు. ఇదిలా ఉం డగా మృతురాలు తల్లి అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం గమనార్హం. ఈ మేరకు జీడి మెట్ల పోలీసులు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్నారు.