Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nadendla Manohar: రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తాం

–ఎరువులు, పురుగు మందుల త యారీదార్లు, డీలర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ప్రతి అడుగులో రైతుని ఆదుకు నేందుకు అంకిత భావంతో పని చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నా దెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముం దుకువెళ్తుందన్నారు.విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషన ర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదార్లు, డీలర్లతో (Pesticide manufacturers and dealers) సమీక్ష సమా వేశం నిర్వహించారు. యూ రియా, డి.ఏ.పి., ఎరువులు, పురు గు మందుల అమ్మకాల విషయం లో రైతులకు ఇబ్బందులు కలగకుం డా జాగ్రత్తలు వహించాలన్నారు. కొల తలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకో వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బరువు, ఎమ్మార్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనపై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు.

తూ నికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ (Joint Controller of Weights and Measures Department)బి. రామ్ కుమార్ తూని కలు, కొలతల శాఖలో కొత్తగా వచ్చి న చట్టాలు, నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుకి ఎక్కడా ఇబ్బంది కలుగకుండా, అన్నదాతకు భరోసా కల్పించే విధంగా ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. ధాన్యం సేకర ణ దగ్గర నుంచి కనీస మద్దతు ధర పకడ్బందీగా ప్రతి రైతుకీ అందించే విధంగా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధం అవుతున్నాం. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో యూరియా, డీఏపీ ధరలు, కొలతల్లో తేడాలు, బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులకు ఇబ్బంది కలుగుతున్న విషయం దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల దుకాణాల వద్ద ఎంఆర్పీని రౌండ్ ఫిగర్ చేసి అమ్ముతున్నారు. రైతులు ఎంత కష్టపడి పంట పండిస్తున్నారో అందరికీ తెలుసు. ఎంఆర్పీ (mrf) కంటే ఎక్కువ ధర తీసుకోవడం అంటే మోసం చేస్తున్నారన్న భావన రైతుల్లో కలుగుతుంది.

252 కేసులు నమోదు తూనికలు, కొలతల శాఖ నుంచి ఇటీవల క్షేత్ర స్థాయిలో చేపట్టిన తనిఖీల్లో (checking) రాష్ట్రవ్యాప్తంగా 252 కేసులు నమోదు చేశాం. అందులో ఎక్కువ కేసులు కొలతల్లో తేడాలు ఉన్నాయని పెట్టినవే ఉన్నాయి. రైతుని ఇబ్బంది పెట్టే విధంగా కొలతల్లో తేడాలు చేస్తే ఉపేక్షించేది లేదు. ఒక్కోచోట బస్తాకి రెండు, మూడు కేజీలు తేడాలు ఉంటున్నాయి. కొలతల విషయంలో తేడాలు ఉండకూడదు. ప్రతి బ్యాగు బరువు చూసి అమ్మాలి. మరికొన్ని అధిక ధరల వసూళ్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి. రవాణాలో బరువు తగ్గితే ఉన్న కొలత లెక్క కట్టి దాని మేరకే ధర చెల్లించే ఏర్పాటు చేయాలి. ఎక్కడా రైతుకి (farmer)మాత్రం ఇబ్బంది కలుగ కుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

గత ప్రభుత్వంలో రైతులు (farmers)చాలా ఇబ్బందులుపడ్డారు. ఎరువులు, విత్తనాల కొరత ప్రధానంగా రైతుని ఇబ్బందిపెట్టింది. మన ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెలా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించి రైతుల పక్షాన నిలబడతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయి. మారిన చట్టాలకు అనుగుణంగా అంతా ముందుకు వెళ్లాలి. కొత్తగా అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనను తయారీదార్లు కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో తయారీదార్లు క్షేత్ర స్థాయిలో డీలర్లు (dealsers)ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దృష్టి సారించాలి. తయారీదార్లు, డీలర్లకి కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. రైతుకి భరోసా కల్పించకపోతే మనం తప్పు చేసిన వారిమవుతాము.

రైతు సంతోషమే మన సంతోషం
మా ప్రభుత్వం ఎల్లవేళలా వినియోగదారుడి పక్షాన నిలబడుతుంది. రైతు సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటాము. సరుకు కొరత వల్ల బ్లాక్ మార్కెట్ (black maret)జరుగుతోందని చెబుతున్నారు. మనం మంచి చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు ధరల్ని నియంత్రించిన విధానం అందుకు ఉదాహరణ. కంది పప్పు కేజీ రూ.180 ఉన్నప్పుడు హోల్ సేలర్స్, రిటెయిలర్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తే మొదట రూ.160కి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మరో రూ.10 తగ్గించి రూ.150కి కేజీ ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. తయారీదార్లు, డీలర్లు రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలి’. అని సూచించారు.