*చంద్రశేఖర్ తివారీ బీజేపి రాష్ట్ర సంఘటన మంత్రి *
Nagam Varshit Reddy: ప్రజా దీవెన, నల్గొండ:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలంటే బూత్ స్థాయిలో పార్టీనీ మరింత బలోపేతం చేయాలని నాగార్జున సాగర్ నియోజక వర్గంలోనీ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సంస్థాగత సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆపార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ కోరుతూ పలు సూచనలు చేశారు..
*చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ*
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని పార్టీ క్యాడర్ ప్రజలలోకి 11 సంవత్సరాల అత్భుతమైన పాలన గురించి ప్రజలకు వివరించాలని సూచించారు..గత ప్రభుత్వం ఏవిధంగా అయితే ప్రజలను మభ్యపెట్టిందో అదే బాటలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అని ఎద్దేవ చేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.
*నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ*
నల్గొండ జిల్లాలో గాలి మాటలతో గాలిలో చక్కర్లు కొడుతున్న ఇద్దరు మంత్రుల పరిస్థితి దయనీయంగా తయారయింది అని విమర్శించారు, నల్గొండ జిల్లాకు పేరుకే మంత్రులుగా చలామణి అవుతున్నారే తప్ప తట్టమట్టి పోసింది లేదు గుక్కెడు నీళ్ళు తెచ్చింది లేదని తీవ్ర స్థాయిలో వర్షిత్ రెడ్డి విమర్శించారు,రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్,కంకణాల నివేదిత రెడ్డి,కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, ధోనూరి వీరారెడ్డి,కర్నాటి సురేష్, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు శనగోని రాములు, పోతేపాక లింగస్వామి,జిల్లా పదాదికారులు,వివిధ మోర్చాల రాష్ట్ర నాయకులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు..