— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Ila Tripathi: ప్రజా దీవెన, చండూరు: చండూరు మండల కేంద్రంలో చేప ట్టిన భవిత కేంద్రం పనులను నాలు గైదు రోజుల్లోపూర్తి చేసి అప్ప గించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చండూరు మండల కేంద్రంలో భవిత కేంద్రం, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పి హెచ్ సి లోని ఓ పి,ఏ ఎన్ సి రిజిస్టర్ లను,ఇతర రిజిస్టర్ లను పరిశీలించారు.ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ప్రసవం కోసం వచ్చిన కేసులు, ఆస్పత్రి నుండి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసిన కేసుల వివరాలు పరిశీలించారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లతో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై చర్చించారు .పీహెచ్ సి పరిధిలో ఎలాంటి మాతా,శిశు మరణాలు సంభవించకుండా చూసుకోవాలని, గర్భిణీస్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ,ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత లేకుండా ఐరన్ మాత్రల పంపిణీ వంటివి చేపట్టాలని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ ,ఇన్చార్జ్ ఆర్డిఓ రమణారెడ్డి లతో కలిసి ఏరియా ఆస్పత్రి కోసం చండూరు పెట్రోల్ పంపు పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవిత కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. నాలుగైదు రోజుల్లో పనులు పూర్తిచేసి అప్పగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.అంతే కాక కేంద్రంలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను పరిశీలించారు.పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల రేకుల షెడ్ లో నిర్వహిస్తుండగా, 2 రోజుల్లో రేకుల షెడ్ నుండి పిల్లలను పక్కా భవనంలోకి మార్చాలని తహసిల్దార్ లను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, పశు సంవర్థక శాఖ సహా య సంచాలకులు నాగమల్లేశ్వర రావు, ఇతర అధి కారులు, తదిత రులు ఉన్నారు.