Politicsతెలంగాణనల్గొండ

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశం, డి విజన్ ప్రజావాణికి అధికారులం ద రూ హాజరవ్వాల్సిందే 

–ప్రజావాణికి డివిజన్ స్థాయి అధి కారులందరూ హాజరుకావాలి

–సమస్యల పరిష్కారంలో అధికా రులు బాధ్యతగా వ్యవహరించాలి –ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తే చర్య లు తప్పవు

–జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ హెచ్చరిక

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన దేవరకొండ: ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖ ర్ వినూత్నంగా ఆలోచించారు. సాధారణంగా ప్రతి సోమవారం జి ల్లా కేంద్రంలో ప్రజావాణి నిర్వహిం చి ప్రజల సమస్యలు విని పరిష్క రించేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు.అయితే క్షేత్ర స్థాయి లో ప్రజల సమస్యల సత్వర పరి ష్కారం లో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం గత ఏప్రిల్ 30 న, జి ఓ 3 ద్వారా డివిజన్ స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో మాదిరిగానే తప్ప నిసరిగా ప్రజావాణిని నిర్వహించా లని ఆదేశించింది. ఈ మేరకు న ల్గొండ జిల్లాలోని నల్గొండ, దేవర కొండ,మిర్యాలగూడ,చండూరు డి విజన్లలో ప్రతి సోమవారం ప్రజావా ణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అయితే చిన్న చి న్న సమస్యల పరిష్కారానికి కూ డా పిర్యాదుదారులు చందం పేట, నెరేడుగొమ్ము లాంటి సుదూర ప్రాం తాలనుండి వ్యయ ప్రయాసాల కోర్చి నల్గొండకు రావడం గమనిం చిన జిల్లా కలెక్టర్ తానే డివిజన్ స్థా యికి వెళ్లి ప్రజల సమస్యలు విని పరిష్కరించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం దేవ రకొండ ఆర్డీవో కార్యాలయంలో ని ర్వహించిన ప్రజావాణి కార్యక్రమా నికి ఆయన హాజరై ప్రజలవద్దనుం డి ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సందర్బంగా డివిజన్ స్థాయికి ఇ ప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించి ఫిర్యాదులు,పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు,అడిగి తెలు సుకున్నారు. ప్రజావాణికి హాజరైన డివిజన్ స్థాయి అధికారుల అటెం డెన్స్ పరిశీలించారు. ప్రజావాణికి హాజరు కాని సహాయ ఎక్సయిజ్ అధికారి,మత్స్య శాఖ,అటవీ శా ఖ,అల్పసంఖ్యాఖ ,పౌర సరఫరాల అధికారి,మోటార్ వెహికిల్ ఇన్స్పె క్టర్,వ్యవసాయ సహాయ సంచాల కులకు షోకాజ్ నోటీస్ జారీ చేయా లని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్బంగా అధికారులతో ఆ యన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు ప్రతి సోమ వారం తప్పనిసరిగా డివిజన్ స్థా యి ప్రజావాణి కార్యక్రమాన్ని కచ్చి తంగా నిర్వహించాలని, ప్రజావాణి పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. చిన్న చిన్న స మస్యలకు కూడా ప్రజలు సుదూర ప్రాంతాలనుండి నల్గొండ జిల్లా కేం ద్రానికి వస్తున్నారని, అలాకాకుం డా , ఏ సమస్య అయినా మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కారం కావాలని, ఆ విధంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని చె ప్పారు. తమ స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు ప్రభుత్వ స్థాయి లో ఉంటే ఫిర్యాదుదాలకు తెలియ జేయాలని, అలాగే సమస్య పరి ష్కారమైతే ఆ విషయాన్ని కూడా ఫిర్యాదుదారుకు తెలియజేయా ల ని ఆదేశించారు. వారంరోజుల్లో ప్ర జావాణి ఫిర్యాదులు పరిష్కారం కావాలని, ఒకసారి వచ్చిన ఫిర్యా దుదారు మళ్ళీ రాకూడదని,” ప్ర జావాణి డివిజన్ స్థాయిలో సమ స్యలను పరిష్కరించే వేదికలు కా వాలన్నారు.

అధికారులు బాధ్యతగా వ్యవహ రించి సమస్యల పరిష్కారానికి కృ షి చేయాల్సిన అవసరం ఉందని, అందువల్ల ప్రతి సోమవారం ఉద యం10.15 గంటలకే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని, ఏ వారం ఫిర్యాదులు అదేవారం పరి ష్కరించాలని ఆదేశించారు. దేవ రకొండ, కొండమల్లేపల్లి పట్టణాల లోని అన్ని చెరువుల ఎఫ్ టిఎల్ ని ర్ధారించాలని, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను, ప్రత్యామ్నాయ పం టలపై రైతులకు అవగాహన కల్పిం చాలని వ్యవసాయ అధికారిని, స బ్ స్టేషన్ నిర్మాణానికి స్థలం విష యం పరిష్కరించాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. సోమ వారం దేవరకొండ ఆర్ డిఓ కార్యా లయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భూముల సమస్య లు,పిల్లలు తల్లిదండ్రులను పోషిం చని కేసులు,వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ,ఉపాధి, తదితర అంశాల కు సంబంధించిన సమస్యలు వ చ్చాయి. దేవరకొండ ఆర్ డిఓ పి. పద్మప్రియ, డిఎస్పీ శ్రీనివాస రావు, మున్సిపల్ కమిషనర్, డి విజన్ స్థాయి అధికారులు, ప్రజా వాణి కార్యక్రమానికి హాజరయ్యారు.

*జూలై చివరి నాటికి నక్ష సర్వే కార్యక్రమo పూర్తి*

పైలెట్ పద్ధతిలో ఎంపిక చేసిన మున్సిపల్ పట్టణ ప్రాంతాలలోని స్థలాలు, భూములు, మౌలిక సదు పాయాల ఖచ్చిత సమాచారనికై ఉద్దేశించి మిర్యాలగూడ మున్సి పాలిటీలో చేపట్టిన “నక్ష సర్వే” కార్యక్రమాన్ని జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. సోమ వారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావునక్ష సర్వే కు పైలెట్ పథకం కింద ఎంపికైన మున్సిపాలి టీలలో సర్వే పురోగతి పై జిల్లా క లెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.ఈ కార్యక్రమం కింద నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎంపిక కాగా, ఇందులో భాగంగా ఇండ్లు, ఖాళీ స్థలాలు, భవనాలకు సంబంధించి నిర్వహిస్తున్న సర్వే సందర్భంగా 32 వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని ,356 బ్లాకులు, 43 వ్యవసాయ బ్లాకులు ,313 భవనాల బ్లాకులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 25 వేల ఆస్తులను గుర్తించగా, ఇప్పటివరకు 9375 ఆస్తులకు సంబంధించిన సర్వేను పూర్తి చేసి 37% పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

సర్వేలో భాగంగా 6 వార్డుల సర్వే పూర్తి చేయడం జరిగిందని, మరో 6 వార్డుల సర్వే పురోగతిలో ఉంద ని చెప్పారు. సర్వేకై 5 బృందాలు ఏర్పాటు చేశామని అలాగే 5 లైసె న్స్ సర్వేయర్ల బృందాలను నియ మించామని, ఇండ్లు, బహిరంగ స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన మ్యాపింగ్ ఇందు లో నిర్వహించేందుకు మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేయడం జ రిగిందని ఆయన చెప్పారు. జూలై చివరి నాటికి “నక్ష సర్వేను” మిర్యా లగూడ మున్సిపాలిటీలో పూర్తి చే స్తామని ఆయన వివరించారు.

అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ నక్ష సర్వేను వేగ వంతం చేసి సకాలంలో పూర్తి చే యాలని ఆదేశించారు.

Related Articles

Back to top button