Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Ila Tripathi: : పద్మ పురస్కారాలకు అర్హల నుండి దరఖాస్తులు ఆహ్వానం

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgonda District Collector Ila Tripathi: : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పుర స్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.

పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూ షణ్ అవార్డులు భారతదేశంలో అ త్యున్నత పౌర పురస్కారాలలో ఒకటని,ఈ అవార్డులను 1954 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్స వం సందర్భంగా ప్రకటిస్తారని కలె క్టర్ తెలిపారు. కళలు, సాహి త్యం ,విద్య, క్రీడలు, వైద్యం, సా మాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణి జ్యం మరియు పరిశ్రమలు మొద లైన రంగాలలో విశిష్ట సేవలు అం దించి విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారని ఆమె తెలి పారు. జాతి, వృత్తి, లింగ బేధం లే కుండా అందరూ ఈ అవార్డులకు అ ర్హులని, 2026 సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ htt ps://awards.gov.in ద్వారా స్వీ కరించబడతాయని వెల్లడించారు.

నామినేషన్లను జూలై 31, 2025 లోగా పైన పేర్కొన్న పోర్టల్‌లో అం దుబాటులో ఉన్న ఫార్మాట్‌లో, గరి ష్టంగా 800 పదాలకు మించకుండా వివరణాత్మక కథనం రూపంలో పంపించాలని తెలిపారు.అవార్డ్ కు ప్రతిపాదిస్తున్న వ్యక్తి యొక్క విశి ష్టమైన మరియు అత్యుత్తమ సేవ/కృషిని స్పష్టంగా తెలియజేయాల ని, ఆన్‌లైన్లో నామినేషన్లు పంప డానికి అవసరమైన సూచనలు https://awards.gov.in పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని, అలా గే నియమ నిబంధనలు పద్మ అ వార్డుల వెబ్‌సైట్:https://padm aawards.gov.in లో అందుబా టులో ఉన్నాయని తెలిపారు. నా మినేషన్ల ఖరారు సమయంలో ప్రతిపాదిత వ్యక్తులు జీవితకాలం పాటు చేసిన కృషికి అత్యంత ప్రశం సనీయులని నిర్ధారించే అంశాలు, సమాజానికి వారి సేవ మరియు సా ధనలలోని గొప్పతనం పరిగణనలో కి తీసుకోవడం జరుగుతుందని తె లిపారు.

పద్మ అవార్డు దేశంలో రెం డవ అత్యున్నత పౌర పురస్కారం అయినందున రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో లేదా వారి సంబంధిత రంగంలో ఇప్పటికే ఏదైనా అవార్డు పొందిన వ్యక్తిని కూడా పరిగణన లోకి తీసుకోవడంజరుగుతుందని, సమాజంలోని బలహీన వర్గాలైన మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు మొదలైన వారిలో ప్రతిభావంతుల ను గుర్తించడానికి ఇది ఒక మంచి అవకాశం అని పేర్కొన్నారు. డాక్ట ర్లు శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు , ప్రభుత్వ రంగ సంస్థల లో పనిచేసేవారు పద్మ అవార్డులకు అర్హులు కారని తెలిపారు.

జిల్లాలో పైన పేర్కొన్న రంగాలలో అత్యున్నత , విశిష్ట సేవలు అం దించిన వారు జూలై 31 ,2025 లోగా రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా పద్మ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని, ముఖ్యంగా మహి ళలు ,షెడ్యూల్డ్ కులాలు, తెగలు, దివ్యాంగుల లో ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు