— టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షు డు గుండగోని జయశంకర్ గౌడ్
Nalgonda District Collector Ila Tripathi: : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లాలోని సమస్త జర్నలిస్టు పిల్లలకు ఆయా ప్రాంతాల్లోని ప్రైవే టు పాఠశాలల్లో ఫీజు రాయితీ అవ కాశం కల్పించాలని టియుడ బ్ల్యూ జే జిల్లా అధ్యక్షుడు గుండగోని జ యశంకర్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, ఎం జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ లతో కలి సి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి విన తిపత్రం సమర్పించారు. జిల్లాలోని వివిధ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల తో పాటు ప్రధానంగా చిన్న పత్రికల సంపాదకులు తమ పిల్లలను ప్రైవే టు పాఠశాలల్లో చదివించేందుకు ఫీజులు చెల్లించ లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
స మాజంలో జర్నలిస్టుకు ఉన్న గు ర్తింపు ప్రాతిపదికగా వృత్తిలో కొన సాగుతున్నప్పటికీ అనేకమంది ఆర్థి క సమస్యలతో సతమవుతున్నార ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవే టు పాఠశాలలు, కళాశాలల్లో జర్న లిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రా యితీ అవకాశం కల్పించాలని విజ్ఞ ప్తి చేశారు. టి యు డబ్ల్యూ జే వినతి పత్రం లో అంశాలపై తప్పకుండా అధికారులతో చర్చించి జర్నలిస్టు పిల్లలకు సాధ్యమైనంత తొందరలో ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేయిస్తామని కలెక్టర్ సంద ర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు దం డంపల్లి రవికుమార్, రాంప్రసాద్, ముచ్చర్ల శ్రీనివాస్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.