–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి
Nalgonda District Collector Ila Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలె క్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫి ర్యాదులు స్వీకరించారు.అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాల పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఐసి డిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మాత్రమే కాకుండా, గ్రా మాలలో అంగన్వాడి, ఆయా, ఆశ వర్కర్ల ద్వారా గర్భిణీస్త్రీలు, బాలిం తలు, చిన్నపిల్లలకు పౌష్టికాహార పంపిణీ, గర్భిణీ స్త్రీలకు నిరంతర పరీక్షలు, చికిత్స , తదితర అంశా లను చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు.అనారోగ్యంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి వచ్చేవారు అ నారోగ్యం ముదిరి చివరి నిమిషం లో రాకుండా ముందే వచ్చే విధంగా అవగాహన కల్పించాలని డిఎం హె చ్ ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ మాతృ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ లకు సూచించారు. త్వరలోనే రా ష్ట్ర రవాణా,బిసి శాఖ మంత్రి ఉ మ్మడి నల్గొండ జిల్లా సమీక్ష నిర్వ హించనున్నందున సంబంధిత అధి కారులు సమాచారంతో సమీక్షకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు .
అంతకుముందు ఉదయం నిర్వ హించిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవిత కేంద్రాల పనులపై సమీక్షించారు.భవిత కేంద్రాల ఆధు నీకరణలో భాగంగా చేపట్టిన మర మ్మతు పనులు, రైలింగ్ ,ర్యాంపు , ఆక్టివిటీ రూమ్ ఇతర సివిల్ పను లను వెంటనే పూర్తి చేయాలని ఆదే శించారు. భవిత కేంద్రాలకు సరఫ రా చేసిన మెటీరియల్ ను భవిత కేంద్రాల ఇన్చార్జి అధికారులు జాగ్ర త్తగా అన్ని ఉన్నాయో లేదో తనిఖీ చేసుకొని తీసుకోవాలని, అన్ని సక్ర మంగా ఉన్నట్లు సంతకం చేయాల ని చెప్పారు.
భవిత కేంద్రం సామాగ్రిని ఎట్టి పరి స్థితులలో కేంద్రం బయట ఉంచకూ డదని, భవిత కేంద్రంలోనే ఉంచాల ని , మెటీరియల్ ను సద్వినియో గం చేసుకోవాలని చెప్పారు. ఇది వరకే జారి చేసిన ఆదేశాల ప్రకా రం అన్ని కేంద్రాలు సవ్యంగా నడిచేలా చూడాలని అన్నారు. రెవెన్యూ అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్చార్జి డి ఆర్ ఓ వై. అశోక్ రెడ్డి, డి ఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహనిర్మాణ పి డి రా జ్ కుమార్, జిల్లా అధికారులు ప్రజ ల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిం చారు.