Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Ila Tripathi : పిహెచ్ సిలలో నల్లగొండ జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ, పే దలకు అన్ని రకాల వైద్యసేవలo దించాలని ఆదేశం 

Nalgonda District Collector Ila Tripathi :

ప్రజా దీవెన, దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవల అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశిం చారు.బుధవారం ఆమె నల్గొండ జి ల్లా దేవరకొండ, చందంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఆకస్మికంగా తనిఖీ చే శారు.

ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, బుధవారం ఆస్పత్రికి వచ్చి న రోగుల ఓపి, ఏఎన్ సీ, శానిటేష న్ తదితర అంశాలను అడిగి తెలు సుకున్నారు. అంతేకాక వివిధ రకా ల రిజిస్టర్ ల నిర్వహణను ఆమె ప రిశీలించారు. ఆస్పత్రి సూపరింటెం డెంట్ రవి ప్రకాష్ జిల్లా కలెక్టర్ కు ఆ స్పత్రి పని తీరును వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డీవో కా ర్యాలయ నూతన భవన నిర్మాణా నికి గాను డిండి రోడ్ లో స్థలాన్ని ప రిశీలించారు. దేవరకొండ ఆర్డీవో ర మణారెడ్డి, జిల్లా గృహ నిర్మాణ ప్రా జెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్, దేవర కొండ ఏరియా ఆసుపత్రి సూపరిం టిండెంట్ రవి ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, తహ సిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో డేని యల్ తదితరులు జిల్లా కలెక్టర్ వెం ట ఉన్నారు.

*చందంపేటలో పర్యటన…* చం దంపేట మండలం, గగిలిపురంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇం డ్ల ను వెంటనే లబ్ధిదారులకు కేటా యించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డై రెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశిం చా రు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా చందంపేట మండలం, గగిలి పురం లో నిర్మాణంలో ఉన్న 2బి హెచ్ కె ఇండ్లను పరిశీలించారు. కాగా గ్రా మానికి 25 డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లు మంజూరు కాగా దాదాపు అ న్ని ఇల్లు పూర్తి అయ్యాయని గృహ నిర్మాణ శాఖ పీడీ జిల్లా కలెక్టర్ కు వివరించగా, తక్షణమే వాటిని లబ్ధి దారులకు కేటాయించి గృహ ప్రవే శాలు చేసేలా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ చందంపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆ కస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో రోగులకు చేస్తున్న వైద్య పరీక్ష లు, ప్రసవాలు, ఎనీమియా రోగు ల కు ఇస్తున్న చికిత్స, గ్రామీణ ప్రాం తంలోని మహిళలు పిల్లలకు, పిల్ల లకు మధ్య ఎడం పాటించడం, పౌ షికాహారం, గర్భిణీ స్త్రీలకు అందించే చికిత్స,తదితర అంశాలను ప్రాథమి క వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రవల్లిక తో అడిగి తెలుసుకు న్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వ హిస్తున్న స్వస్త్ నారి స్వశక్తి ప రివార్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.