Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Tripathi : అర్హులైన యువత పెద్ద ఎత్తున దర ఖాస్తులు చేసుకోవాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన కనగల్: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాస పథకం కింద అర్హులైన యువత పెద్ద ఎత్తున దర ఖాస్తు చేసుకోవాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ,ఈబీసీ యువ తకు స్వయం ఉపాధి కల్పించేం దు కు ఉద్దేశించి ప్రతిష్టాత్మకంగా అమ లు చేయనున్న రాజీవ్ యువ వి కాస పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా నల్గొండ జి ల్లాలో యువతకు అవగాహన క ల్పించడంలో భాగంగా షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం, జి .యడవల్లి గ్రామంలో రాజీవ్ యువ వికాస పథకంపై అ వగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ జి. యడ వల్లి గ్రామం అత్యంత వెనుకబడిన గ్రామమని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకుగాను రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తాను గ్రామాన్ని దత్తత తీ సుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించా రు. గ్రామ అభివృద్ధిలో భాగంగా అ వసరమైతే గ్రామానికి ప్రత్యేక మం జూరీలు ఇవ్వడం పై దృష్టి పెడ తామన్నారు. రాజీవ్ యువ వికా స పథకంలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, స్థానికత చాలా ముఖ్యమని, ఈనెల 14 లోగా ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోరే వారు దరఖాస్తు చేసుకోవాలని, నాలుగు లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు.

 

దరఖాస్తుతో పాటు, రేషన్ కార్డును జతచేయాలని, ఒకవేళ రేషన్ కా ర్డులు లేనట్లైతే ఆదాయం, కులం ధ్రువపత్రాలు సమర్పించాలని, స్థా నికతహసిల్దార్ 24 గంటల్లో వీటిని జారీచేయాలని పక్కనే ఉన్న తహ సిల్దార్ పద్మను ఆదేశించారు. దర ఖాస్తుదారులు వారి వివరాలను పా రదర్శకంగా సమర్పించాలని, అం దరూ ఒకే రకమైన యూనిట్ కు దరఖాస్తు చేసుకోకుండా వివిధ ర కాల యూనిట్లు ఏర్పాటు చేసేందు కు దరఖాస్తులు చేయాలని, ఈ వి షయాన్ని ఎంపీడీవో దరఖాస్తుదా రులకు స్పష్టంగా తెలియజేయా లని ,ఒకవేళ అందరూ ఒకే యూని ట్ కు దరఖాస్తు చేసినట్లయితే దర ఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశా రు.ఇదివరకే ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులు సైతం అనుమతించ డం జరుగుతుందని, దరఖాస్తు ల ను ఈనెల 14 వరకు స్వీకరించిన అనంతరం దరఖాస్తులపై విచారణ నిర్వహించడం జరుగుతుందని తె లిపారు. ధ్రువపత్రాలు ఉన్న గ్రామం లోనే దరఖాస్తుదారులు దరఖాస్తు చేయాలని , మండల స్థాయిలో వి చారణ అనంతరం జిల్లా స్థాయిలో తన సమక్షంలో దరఖాస్తులపై విచా రణ నిర్వహించడం జరుగు తుందన్నారు.

గతంలో ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ ,బీసీ యూనిట్లకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ప్రత్యేకించి దరఖాస్తు చేసుకోవా ల్సిన అవసరం లేదని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో రాజీవ్ యువ వికాస పథకం కింద దరఖా స్తు చేసుకోవాలని, మహిళలకు మ హిళ శక్తి ఉన్నప్పటికీ దీని ద్వారా దరఖాస్తు చేసుకుంటే కిరాణా లేదా సూపర్ మార్కెట్ వంటివి అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఉంద ని, అందువల్ల భారీ సంఖ్యలో దర ఖాస్తు చేసుకోవాలని కోరారు.

అలాగే దరఖాస్తుదారులు పూర్తిగా వారి వివరాలు మాత్రమే ఇవ్వా లని, ఇతరుల వివరాలను దర ఖాస్తుల్లో చేర్చ వద్దని స్పష్టం చే శారు. రాజీవ్ యువశక్తి కి సంబం ధించి దరఖాస్తు సమర్పించే విష యంలో ఏవైనా సందేహాలను స్థా నిక తహసిల్దార్ లేదా ఎంపీడీవోను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకం కింద జి .ఎడవల్లి నుండి అత్యధిక దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఆమె కోరారు.

ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.మాన్య నాయక్, ఆర్డీవో
వై. అశోక్ రెడ్డి, జిల్లా మైనార్టీ సం క్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, సహాయ బీసీ సం క్షేమ అధికారి సంజీవయ్య, శ్రీని వాస్ గౌడ్, అనూప్ రెడ్డి, తహ సి ల్దార్, ఎంపీడీవో తదితరులు మా ట్లాడారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఎడవల్లి చెరువు అలుగు ను పరిశీ లిం చా రు.అలుగు మరమ్మతులకై త గు ప్రతిపాదనలు పంపించాలని ఆర్డీ వోను, ఎంపీడీవోను ఆదేశిం చారు.