— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda District SP Sharat Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం ని ర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యా లయంలో జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుండి వచ్చిన దాదాపు 45 మం ది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమ ర్పిం చాలని ఆదేశించారు.
ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పో లీస్ శాఖను మరింత చేరువ చేయ డం లక్ష్యంగా ప్రజా సమస్యలను ప రిష్కరించే విధంగా కృషి చేస్తున్నా మని అన్నారు.బాధితుల సమస్య లు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని,పోలీస్ స్టేషన్ కి వ చ్చిన ఫిర్యాదుదారులతో మర్యా దగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థా యిలో పరిశీలించి వేగంగా స్పం దించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరక మైన చర్యలు చేస్తూ శాంతి భద్రత లకు భంగం కలిగించే వారి పట్ల కటి నంగా వ్యవహరించాలని అన్నారు.