— నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
Nalgonda DSP Sivaram Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో నల్లగొండ ఎస్ ఆర్ బ్రాంచ్కు చెంది న విద్యార్థిని బచ్చు ప్రియాంక ఆలిం డియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించగా బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, కళాశాల జోన ల్ ఇన్చార్జి దోనాల శ్రీనివాస్రెడ్డితో కలిసి విద్యార్థినిని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు. అలాగే కళాశాలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కు సూచనలు చేశారు చదువుకునే సమయంలో ఒత్తిడికి గురి కావొద్దని సూచించారు.
ప్రతి సబ్జెక్టును అవగాహన చేసుకొని ప్రిపేర్ అవ్వాలని, భట్టీ విధానానికి స్వస్తి పలుకాలని చెప్పారు. ఆహ్లాకరమైన వాతావరణంలో విద్యనభ్యసించినప్పుడే ఇలాంటి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ ఐ సైదాబాబు, కళాశాల అసిస్టెంట్ జోనల్ సతీశ్రెడ్డి, ప్రిన్సిపాళ్లు మనోజ్ రెడ్డి, డీన్ కిశోర్ బాబు, ఏఓ సరితారెడ్డి, అధ్యాపకులు వర్ధన్, ప్రసన్న కుమార్, శ్రీనివాస్, శోభ ఉన్నారు.