Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nampally Chandramouli: ఇరాన్ పై అమెరిక దాడులు ప్రపంచ శాంతికి విఘాతం

*-
సిపిఎం మండల కార్యదర్శి,నాంపల్లి చంద్రమౌళి

Nampally Chandramouli: ప్రజా దీవెన నాంపల్లి. జూన్ 25 నాంపల్లి మండల కేద్రం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున నల్ల జెండాతో నిరసన తెలిపారు సీపీఐ(ఎం)మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ
జూన్ 13నుండి ఇరాన్ పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు వత్తాసు పలకడమే కాకుండా అమెరికా ప్రత్యక్ష యుద్దానికి పూనుకోవడాన్ని యావత్ ప్రజానీకం వ్యతిరేకించాలని అన్నారు.

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అని ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. యుద్ధాలు ఆపకపోతే ఆయా దేశాల వనరులు లావాదేవీలు దెబ్బతింటాయని అమాయకమైన ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు అణుఆయుధాల తయారీకి ఇరాన్ పూనుకుంటుందని హెచ్చరించిన అమెరికా ఇజ్రాయిల్ వద్ద 180 అణుఆయుధాలు ఉన్నాయనే ప్రచారం ఉన్నా కిమ్మనకుండా అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది.ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికాలో వేలాది మంది ర్యాలీ తీస్తూ. ప్రపంచ దేశాలన్ని అమెరికా దుష్చర్యలను నిరసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా యుద్దాన్ని ఆపి శాంతి నెలకొల్పాలని కోరారు.ఈ కార్యక్రమం లో సీపీఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య గడ్డం గురుమూర్తి, వెంకటయ్య, శంకర్,సైదులు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు