Narendra Modi : ప్రజా దీవెన పెన్ పహాడ్ : మోడీ పాలనలో భారతదేశం అవినీతి రహిత దేశంగా పాలన కొనసాగుతుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి మధు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ దినాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలసి పార్టీ స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతోనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. అనేక సంక్షేమ పథకాలతో దేశం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని గుర్తు చేశారు, మోడీపై నమ్మకంతో దేశ ప్రజలు పలుమార్లు అధికారాన్ని కట్టబెట్టడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు ప్రజల్లో మమేకమై పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు రాపర్తి వెంకన్న,చామకూరి వెంకటేష్ ఒగ్గు వినోద్
తాడోజు జనార్ధనా చారి, మారోజు నాగేంద్ర చారి, గుడపురి శ్రీను, అరె ప్రభాకర్, , పవనగంటి సతీష్ చారి, చిన్నపంగి నాగరాజు, చిత్రం శ్రీకాంత్, కత్తి లక్ష్మయ్య, ఒగ్గు రాములు పాల్గొన్నారు