Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nirmala Sitharaman: బీమా పాలసీలపై గతంలోనూ పన్నులు

— దీనిపై అనవసర రాద్దాంతం తగదన్న ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ

Nirmala Sitharaman: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం లపై జీఎస్టీ ని రద్దు చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమెకు తొలుత లేఖ రాయగా తాజాగా ఇండియా కూటమి సభ్యులు లోక్ సభ వేదికగా జీఎస్టీ తొలగించా లంటూ డిమాండ్ (demand) చేశారు. ఈ క్రమంలో లోక్ సభ లో ఆమె మాట్లా డారు. జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా బీమా ప్రీమి యంలపై పన్ను వసూలు అయ్యే దని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఇదేమీ కొత్త విషయం కాదని, అన్ని రాష్ట్రాల్లో ఇది అమ లైందని పేర్కొన్నారు. జీఎస్టీ విధా నం అమల్లోకి వచ్చాకా అదే విధా నం కొనసాగిందన్నారు.

ఇలా వసూ లైన జీఎస్టీలో (gst) 75 శాతం రాష్ట్రాలకే వెళుతోందని పేర్కొ న్నారు. ఇక్కడ ఆందోళన చేస్తున్న వారు ఎప్పుడై నా తమ రాష్టాల్లో దీనిపై చర్చిం చారా అని ప్రశ్నిం చారు. ఒకరు లేవనెత్తిన అంశంపై ఏకంగా 200 మంది ఎంపీలు పార్లమెంట్ వేదికగా అదే పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. 2024-25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధించిన ఫైనాన్స్ బిల్లు, 2024కు లోక్సభ ఆమోదం తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగానికి బడ్జెట్లో (budget) ప్రతిపాదించిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబం ధనలను ఈ బిల్లులో సవరిం చారు. పాత, కొత్త విధా నంలో ఏది ప్రయో జనకరమమైతే అది ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. 2024- 25 బడ్జెట్లో 20 శాతంగా ఉన్న ఎన్టీ సీజీని 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. అదే సమయం లో ద్రవ్యోల్బణ సూచీ సర్దుబాటును తొలగించారు. రియల్ ఎస్టేట్ రంగం (Real estate sector)నుంచి వ్యతి రేకత వ్యక్తమైన వేళ నాన్స్ బిల్లులో ఆ మేర సవర ణలు చేశారు. మొత్తం 45 సవర ణలతో మూజువాణి ఓటుతో బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. తదుపరి రాజ్యసభలో దీనిపై చర్చిస్తారు. రాజ్యాంగం ప్రకా రం (According to the Constitution
)ద్రవ్య బిల్లులను తిరస్కరించే అధికారం ఎగువ సభకు లేదు. కాబ ట్టి బిల్లు ఆమోదం పొందడం లాంఛ నం కానుంది.