BIG Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: భాగ్యన గరంలో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి విరాళాల వె ల్లువ కొనసాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్ ట్రెండ్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ భారీ విరాళం అందజేశారు. ఎల్లమ్మ గుడి కి కోటి రూపాయల విరాళం అందిం చడమే కాకుండా నేరుగా టెంపుల్ బ్యాంక్ ఖాతాకు విరాళాన్ని ట్రాన్స ఫర్ చేయడం గమనార్హం. గత ఏప్రి ల్ నెలలో నీతా అంబానీ తల్లి పూ ర్ణిమ, సోదరి మమతా దలాల్ బ ల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సంద ర్శించారు. ఈ సందర్భంగా గుడి వి శిష్టతను ఆలయ అధికారులు వారి కి తెలియజేయడంతో పాటు అంతే కాకుండా ఆలయ అభివృద్ధికి సహ కారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయoలో ఆలయ అధికారు ల వినతిని తల్లి పూర్ణిమ నేరుగా నీతా అంబానీకి తెలియజేశారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ ఆలయ అభివృద్ధి కోసం కోటి రూపాయలను విరా ళంగా అమ్మవారి గుడి బ్యాంక్ ఖా తాలో వేశారు. ఈ మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో నిత్యా న్న దానం చేయాలని నిర్ణయించిన ట్లు టెంపుల్ కమిటీ సభ్యులు తెలి యజేశారు. ఇంతటి భారీ విరాళా న్ని అందించిన నీతా అంబానీ కు టుం బసభ్యులకు ఆలయ అధికా రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి నీతా అం బానీ పెద్ద భక్తురాలు అన్న విష యం అందిరికీ తెలిసిందే. నగరానికి ఎప్పుడు వచ్చినా కూడా ఎల్లమ్మను దర్శించుకుని వెళ్తుంటారు నీతా అం బానీ.
ఈ క్రమంలో గత నెలలో నీ తూ అంబానీ తల్లి, సోదరి ఎల్ల మ్మ ను దర్శించుకున్న సమయంలో ఆ లయ అభివృద్ధి సహకరించాలని అధికారులు కోరారు. తల్లి కోరిక మే రకు అలాగే ఎల్లమ్మకు నీతా అం బానీ భక్తురాలు కావడంతో కోటి రూపాయల విరాళాన్ని ఆలయానికి అందజేశారు. అంతేకాకుండా దేశం లోని ప్రముఖ ఆలయాలను కూడా నీతా అంబానీ దర్శించుకుని భారీ విరాళాలు సమర్పించడం తెలిసిం దే.